స్వర చక్రవర్తి,సంగీత దర్శకులు చక్రి ఆరవ వర్ధంతి వేడుకలు కొత్తపేట లోని అందరి ఇళ్ళు లో చక్రి తమ్ముడు మహిత్ నారాయణ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలసి నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అందరి ఇళ్ళు నిర్వాహకులు డా”సూర్య ప్రకాష్,డా”కామేశ్వరి మాట్లాడుతూ.. ఈ రోజు అందరి ఇళ్ళు చక్రి ఇళ్ళు గా మారిందని, ఆయన 6వ వర్ధంతి ఇక్కడ నిర్వహించడం సంతృప్తినిచ్చిందని చెప్పారు.
ఈ సందర్భంగా చక్రి తమ్ముడు, సంగీత దర్శకులు మహిత్ నారాయణ మాట్లాడుతూ.. నాన్న వెంకట్ నారాయణ, అన్నయ్య చక్రి ఆశయ సాధనకు కృషి చేస్తానని తెలిపారు. సంగీత సామ్రాజ్యంలో చక్రి సుస్థిర స్థానాన్ని నిర్మించారని, చక్రి పేరు చిరస్థాయిగా నిలిచి పోయేలా అన్నయ్య పేరుతో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
అలాగే మహబూబ్ బాద్ కాపు సంగం అధ్యక్షులు,టీ ఆర్ ఎస్ నాయకులు డా”కొండ దేవన్న మాట్లాడుతూ.. మహబూబ్ బాద్ లో చక్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చక్రి సన్నిహితులు జె కె మధు, శశిధర్ రెడ్డి,ప్రభాకర్, రాజు, నిశాంత్, యశ్వంత్, మల్లేష్,సందీప్,సాగర్,బంధువులు వలసాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.