Directors Dileep Raja & Achhana Srinivas Yadav Met Ap Cinematography Minster for Movie Development

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుతో ఏపీలో సినీపరిశ్రమ అభివృద్ధిపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష జరపడానికి అంగీకరించినట్లుగా ‘మా – ఏపి’ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఈమేరకు అమరావతి సచివాలయంలో  మరో దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్తో కలసి బుధవారం సినిమాటోగ్రఫీ మంత్రితో చర్చలు జరిపినట్లుగా తెనాలిలో విలేకరులకు చర్చల వివరాలను వెల్లడించారు..

రాష్ట్రంలో ఉచితంగా లోకేషన్లు ఇచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణo,సినీ కార్మికులకు ఇండ్ల స్థలాలు,ఆంధ్రలో సినిమాలు నిర్మించే నిర్మాణ సంస్థలకు సబ్సిడి పెంపుదల తదితర ప్రధాన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి సినిమాటోగ్రఫీ మంత్రి సమీక్ష జరుగుతోందన్నారు.సినీ పరిశ్రమ అభివృద్ధిపై సినీ ప్రముఖులతో జరిగే తదుపరి సమావేశానికి మా-ఏపి ని ఆహ్వానిస్తామని మంత్రి హమీ ఇచ్చినట్లు చెప్పారు.సినిమాటోగ్రఫీ మంత్రితో సమావేశమైనవారిలో ఇంటూరి విజయభాస్కర్ వెంకటేశ్వర్లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here