జీ 5’… ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి.. ఎప్పటి కప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్లతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది. ప్రతి నెలా ఒక కొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా బిబిసి స్టూడియోస్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్ సిరీస్గా నిర్మించింది. ఇందులో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, హీరో సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్నో విజయ వంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన రాధికా శరత్ కుమార్ తనదైన నటనా శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బుల్లితెరపై కూడా విజయాలు అందుకున్నారు. సినిమాలు, సీరియళ్లు చేసిన రాధికా శరత్ కుమార్, ఓటీటీ కోసం షో చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ వెబ్ సిరీస్తో బిబిసి రీజనల్ ఎంటర్టైన్మెంట్లోకి అడుగు పెడుతోంది అని నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్, ‘జీ 5’ సంస్థలు తెలిపాయి. ‘తిమ్మరుసు’ ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ ఒరిజినల్ సిరీస్కు దర్శకత్వం వహిస్తుండగా, సుజాత సిద్ధార్థ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 14 న ZEE5 లో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా ZEE5 యూనిట్ పాత్రికేయుల కొరకు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రివ్యూ ను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా జీ5 తెలుగు ఒరిజినల్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ పద్మా కస్తూరి రంగన్ మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఇప్పుడు తెలుగు సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. త్వరలో ZEE5 లో RRR రాబోతుంది.ZEE5 లో ప్రసారం అవ్వనున్న ప్రీమియం సినిమా క్వాలిటీ సిరీస్ గా వస్తున్న “గాలివాన” వెబ్ సిరీస్ లో అద్భుతమైన సినిమాటోగ్రఫీ తో పాటు గ్రేట్ యాక్టర్స్ నటించారు.ఈ నెల 14 న ZEE5 లో ప్రసారమవుతున్న మా గాలివాన వెబ్ సిరీస్ ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుంది.కనుక మా వెబ్ సిరీస్ ను చూడాలంటే వెంటనే మా ZEE5 ను సబ్స్ క్రైబ్ చేసుకోని చూడండి.మా ZEE5 ప్రొడక్షన్స్ లో రాజ్ తరుణ్,శివాని రాజశేఖర్ లతో “అహనా పెళ్ళంట” వెబ్ సిరీస్ చేస్తున్నాము.సుశాంత్ గారితో కూడా చేస్తున్నాము. అలాగే దిల్ రాజు,కోన వెంకట్ లతో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాము.ఇలా ఇండస్ట్రీలో వున్న అందరితో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఇంకా డీఫ్రెంట్ సబ్జెక్ట్ తో వీక్షకులను అలరించడానికి ZEE5 ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అన్నారు.
నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ..”గాలివాన” ఫస్ట్ ఎపిసోడ్ లో ఎన్నో క్యారెక్టర్లను రివీల్ చేస్తున్నాం .ఇందులో ఉన్న ఏడు ఎపిసోడ్స్ కూడా చరణ్ చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు. మంచి ఇంటెన్స్ ను క్రియేట్ చేస్తూ సస్పెన్స్,క్రైమ్ డ్రామాగా వీక్షకుల ముందుకు వస్తున్న “గాలివాన” వెబ్ సిరీస్ ను బిబిసి ,ZEE5 టీంతో కలిసి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ నెల 14 న ప్రసార మవుతున్న “గాలివాన” వెబ్ సిరీస్ పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది అన్నారు
హీరో సుమంత్ మాట్లాడుతూ.. ఒక నటుడికి మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్ ఇంపార్టెంట్. ముందు నాకు వెబ్ సిరీస్ కథ చెప్పినప్పుడు వెబ్ సిరీస్ చేద్దామా సినిమా చేద్దామా అనుకున్నప్పుడు తను చెప్పిన కంటెంట్ నచ్చి వెబ్ సిరీస్ చేస్తున్నాను.అయితే ఇప్పటి వరకు నేను వెబ్ సిరీస్ చెయ్యలేదు. ఇప్పుడు చేస్తున్న వెబ్ సిరీస్ ద్వారా కొత్త సుశాంత్ ను చూస్తారు .ఈ వెబ్ సిరీస్ లో నటిస్తుంటే నాకు సినిమా చేస్తున్న ఫీలింగే కలుగుతుంది.ఎందుకంటే బడ్జెట్ పరంగా కాంప్రమైజ్ కాకుండా సినిమా ఎలా తీస్తారో వెబ్ సిరీస్ ను కూడా అలాగే నిర్మిస్తున్నారు. అలాగే సీనియర్ నటులతో డిఫరెంట్ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ గాలి వాన కు మంచి కాస్ట్ అండ్ క్రూ దొరికారు.సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ గా గాలివాన గొప్ప విజయం గొప్ప విజయం సాధించాలి అన్నారు
దర్శకుడు చరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ.. బిబిసి, g5 శరత్ మరార్ లతో కలసి చేసిన గాలివాన వెబ్ సిరీస్ చాలా బాగా వచ్చిందిమ్ ఈ సినిమాలో రెయిన్ సీన్స్ చాలా కష్టపడాల్సి వచ్చింది.ఇందులోని రైన్ సీన్స్ కొసం ఎన్నో ట్యాంకర్స్ ను వాడాము. బడ్జెట్లో ఎక్కువ శాతం వాటర్ ట్యాంకర్ల ఖర్చయింది. ఇందులోని ఆర్టిస్టులు అందరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా రాధిక మేడం, సాయికుమార్ గార్లు ఫుల్ సపోర్ట్ చేశారు. పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు
నటి నందిని గారు మాట్లాడుతూ.. నేను ఇప్పటివరకు గ్లామర్ పత్రాలలో ఏక్కువగా నటించాను. మొదటి సారిగా నేను కాప్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఇప్పటివరకు నేను కాప్ క్యారెక్టర్ లో నటించలేదు. నాకు ఇది స్పెషల్ రోల్. ఇందులో మేమంతా చాలా బాగా నటించాము.ఈ రోజు విలేకరులకు వేసిన మా ఫస్ట్ ప్రివ్యూ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము.ఈ నెల 15 న ZEE5 లో ప్రసారమవుతున్న అన్ని ఎపిసోడ్స్ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.