‘Devineni’ Audio Launched by Producer D.S.Rao

బెజవాడలో ఇద్దరు మహా నాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబ నేపథ్యంలో సెంటిమెంట్‌ కలయికలో ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి తారకరత్న హీరోగా వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటీ,నటులుగా నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) ద‌ర్శ‌క‌త్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దేవినేని’ దీనికి ”బెజవాడ సింహం” అనేది ట్యాగ్ లైన్.ఈ చిత్రం ఆడియో వేడుక శనివారం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత డి.యస్ రావు “దేవినేని” ఆడియోను విడుదల చేశారు.ఈ చిత్రం లో నటించిన తుమ్మల పల్లి రామ సత్యనారాయణ ,బాక్స్ ఆఫీస్ చందు రమేష్,లక్ష్మీ నివాస్,లిరిక్ రైటర్ మల్లిక్, లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.అనంతరం

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ…దేవినేని సినిమా గురించి విజయవాడ నుంచి నాకు కొంతమంది నాయకులు ఈ సినిమా ఆపేయమని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు.నేను అందరికి తెలియజేసేది ఏంటంటే నేను దర్శకుడిగా,కళాకారుడిగా మంచి కథ దొరికితే ప్రజలకు చేరవేయాలని తపనతోనే మేము సినిమాలు తీస్తాం తప్ప మాకు ఎవరిమీద పగలు,
ప్రతీకారాలు ఉండవు.అందర్నీ మిత్రులుగా భావిస్తాం
నేను దేవినేని వంగవీటి గార్ల మీద అభిమానంతోనే సినిమా తీశాను. ఈ సినిమా చేసే ముందు కూడా దేవినేని అవినాష్ గారిని కలిసి ఈ సినిమా చేస్తున్నాం అని తెలియజేయడం జరిగింది. దేవినేని అవినాష్ కూడా మేమందరం ఫ్రెండ్స్ గా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం ఎక్కడ మాకు ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పడం తో చాలా సంతోషం వేసింది వారు చెప్పిన విదంగానే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ సినిమా చేయడం జరిగింది .ఇందులో మేము ఎవ్వరినీ కించపరిచే విధంగా తీయలేదు.బెజవాడలో చాలామంది నా మిత్రులకు ఈ సినిమా చేస్తున్నాం అని చెబుతూనే ఉన్నాను.ఈ సినిమా బెజవాడ లో ఇరు కుటుంబాలు నాయకులు మంచి వారిగా ఉంటూ మహా నాయకులుగా ఎలా ఎదిగారు. వారిద్దరిలో ఎలాంటి ఫ్రెండ్షిప్ రిలేషన్ ఉండేదని తెలియజేస్తూ…వారి దగ్గర ఉన్న అనుచరుల వలన చిన్న చిన్న సమస్యలతో వారు ఎలా విడిపోయారు. ఏ స్నేహితులైన అలా విడిపోకుండా స్నేహంగా ఉండాలిలని తెలియజేస్తూ తీసిన సినిమానే ఈ “దేవినేని”. నేను గుంటూరు జిల్లా వాడినే నా విజయవాడ నా వాళ్లు , నేను అభిమానించే కుటుంబం పైన సినిమా చేయడం తప్ప, మిమ్మల్ని నేను ఎక్కడ కించపరిచేలా చేయలేదు. మీరు ఎందుకు ఈ సినిమా గురించి భయపడుతున్నారు. అవినాష్ ఎందుకు నాపై కేసులు పెడుతున్నారు.ఫిలింఛాంబర్లో నేను టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అడిగితే వాళ్ళ దేవినేని వారి దగ్గర లెటర్ తీసుకు వస్తేనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేస్తామని అన్నారు .సినిమా టైటిల్ కోసం గత రెండు నెలలుగా నేను అవినాష్ గారికి ఫోన్లు చేస్తూనే ఉన్నాను. అయిన వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు.అవినాశ్ బంధువుల బాబుతో కూడా టైటిల్ కోసం మాట్లాడాను.దేవినేని అభిమానంతో ఈ సినిమా తీశాను టైటిల్ ఇప్పించమని అడగడం జరిగింది. వారి నుండి స్పందన రాలేదు.. అవినాష్ గారు నేను చేసిన తప్పేంటి ? నా పైన మీరు కోర్టులో కేసు ఎందుకు వేశారు నేను సినిమా చేసేటప్పుడే మీరు సినిమా చేయొద్దు అని చెబితే.. నేను చేసే వాడిని కాదు . సినిమా మొత్తం పూర్తి అయిన తర్వాత మీరు పార్టీ మారిన తర్వాత ఇప్పుడు సినిమా విడుదల చేయడానికి వీల్లేదు సినిమా స్టాప్ చేయమని చెప్తున్నారు.మీరు ఇలా చేయడం వల్ల కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాతలు ఎంత నష్టపోతారో మీకు తెలుసా? దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఇబ్బంది కలగాకుండా చూడండి. ఒకసారి మీరు సినిమా చూసి సినిమాలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే మాకు తెలపండి కరెక్షన్ చేసుకుంటాం.అంతే తప్ప మాపై కేసులు పెడితే మాకు భరించే ఓపిక లేదు. వంగవీటి అభిమానుల గాని దేవినేని అభిమానులు గాని ఎవరినీ డ్యామేజ్ చేసే విధంగా సినిమా లో ఎక్కడ చూపించలేదు. బెజవాడ కథను ఒక మహాభారత కథతో పోల్చి తీయడం జరిగింది. దయచేసి మా పైన కేసులు వెయ్యకుండా ఆపాలని కోరుతున్నామని అన్నారు.

చిత్ర నిర్మాత రాము రాథోడ్ మాట్లాడుతూ..నాకు ఏదైనా ఒక మంచి సినిమా తీయాలనేది డ్రీమ్ ఉండేది విజయవాడలో తిరుగుతున్నప్పుడు దేవినేని వారి హోర్డింగ్స్, వారు చేసే మంచి పనులకు చాలా ఇంప్రెస్ అయ్యేవాడిని. ఆ తర్వాత దేవినేని మీద ఏదో ఒక సినిమా తీయాలని తపన ఉండేది. ఆ తర్వాత అమరావతిలో నాకు శివనాగు గారు కలవడం జరిగింది. దేవినేని పైన నా దగ్గర కథ ఉంది అది చేద్దామని నాకు చెప్పడంతో నేను ఏదైతే చేయాలని కలగంటున్నానో ఆ కథ నా దగ్గరికి రావడం చాలా సంతోషం అనిపించింది ఇందులో దేవినేని, వంగవీటి వీరిద్దరూ ఫ్రెండ్స్ గా, ఎంత అన్యోన్యంగా ఉండే వారే తెలుపుతూ ఆ తర్వాత వారు ఎందుకు విడిపోయారో ప్రజలకు ఈ చిత్రం ద్వారా తెలియ చేయడం జరిగింది. ఇందులో మంచి చూపించాము కానీ చెడు చూపించలేదు.ఇద్దరు స్నేహితుల విడిపోయినప్పుడు వారి మధ్య ఎలాంటి మాటలు వస్తాయి ఎలాంటి ఘర్షణ జరుగుతుంది అనేది ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరు సహకరించినా సహకరించకపోయినా దేవినేని గారి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను
ఈ సినిమాను ఆదరించి సక్సెస్ చేసి మమ్మల్ని బ్లెస్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

చలసాని వెంకటరత్నం పాత్రలో నటించిన తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 1980లో నన్ను హీరోగా చేయమని భారతిరాజా గారు,ఆ తర్వాత సత్య రెడ్డి గారు మూడు సినిమాలు కాంట్రాక్ట్ చేసి ఒక్కొక్క సినిమాకు 5 లక్షలుగా15 లక్షలు ఇస్తానని ఆఫర్ చేసినా నేను వారి ఆఫర్ ను సున్నితంగా వద్దని చెప్పడం జరిగింది.సినిమాలో రంగు వేసుకుని నటించే ఇష్టం లేక నటిస్తే  ఒరిజినల్ క్యారెక్టర్ నాకు కాకుండా  పోతుందనే భయంతో నేను నో చెప్పడం జరిగింది ఇప్పుడు దేవినేని కి  నటించే ఇష్టంలేక వద్దని చెప్పిన దర్శకుడు మీరు  రంగు వేసుకోకుండా యాక్ట్  చేయమని చెప్పడం తో ఇందులో నటించడం జరిగింది. వెంకటరత్నం గారంటే కులాలకు జాతులకు మతాలకు అతీతంగా కమ్యూనిజంలో పెద్ద తరహా లో ఉంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరి సమస్యలు పరిష్కరించే పెద్దమనిషి చలసాని వెంకటరత్నం గారు. అలాంటి మహనీయుని పాత్ర చేయడం చాలా సంతోషంగా ఉంది. బెజవాడకు సంబంధించిన ఎన్నో సినిమాలు వచ్చినా అన్నిటిలోనూ గ్యాంగ్ వార్ చూపిస్తూ దేవినేని ఇరు కుటుంబాలు భద్ద శత్రువుల్లా  ఒకరినొకరు చంపుకునే విధంగా.ఇప్పటివరకు చూపించారు.గతంలో బెజవాడ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.దేవికానీ ఇందులో వీరి కుటుంబాలకు మంచి అవినాభావ సంబంధం ఉందని తెలియజేస్తూ వంగవీటి రంగా ఒక  అమ్మాయిని ప్రేమిస్తే దేవినేని గారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం లాంటి వారి  మధ్య వున్న అవినాభావ సంబంధాలను తెలియజేస్తూ.. తర్వాత వారి మధ్య  మనస్పర్థలు వచ్చి ఎలా విడిపోయారు అనే విధంగా  ఇప్పటి వరకు ఎవరూ. చూపించని  కొత్త కోణంలో చిత్రాన్ని  నిర్మించడం జరిగింది రాంగోపాల్ వర్మ గారు ఎన్నో సినిమాలు తీసి ఎన్నో కేసులు ఎదుర్కొని ప్రేక్షకుల తీర్పుతో విజయం సాధించాడు.ఈ సినిమాకు అలాంటి తీర్పే వస్తుంది.  సుప్రీంకోర్టు  క్లారిటీగా చెప్పడం జరిగింది ఒకసారి సెన్సార్ అయిపోతే దాన్ని ఎవరు ఆపడానికి లేదని, రాజ్యాంగంలో కూడా ప్రతి మనిషికి భావప్రకటన స్వేచ్ఛ ఉందని తెలియజేసింది అయిన వాటిని పట్టించుకోకుండా ఈ సినిమాలో ఏముందో కూడా తెలుసుకోకుండా ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న తను అందరిపై కేసులు వేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం ఈ సినిమాను  చూసిన ప్రజలే ఈ సినిమాకు అంతిమ తీర్పు ఇస్తారని  ఆశిస్తున్నాను అని అన్నారు

నిర్మాత డి.యస్ రావు మాట్లాడుతూ..బయోపిక్ సినిమాలు తీయడం అంటే నిప్పుతో చెలగాటం ఆడినట్లే, ఇలాంటి మూవీలు చేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొనే గట్స్ ఉండాలి. అలా తీసే దర్శకుల్లో రాంగోపాల్ వర్మ మొదటి వరసలో ఉంటారు.ఇప్పుడు ఆయన శిష్యుడు శివ నాగేశ్వర రావు (శివ నాగు) రాము గారి బాటలో పయనిస్తూ “దేవినేని” సినిమాతో మన ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.మంచి కంటెంట్ ఉంటే చాలు స్టార్స్  ఉండాల్సిన  అవసరం లేదని ఈ మధ్య సినిమాలు నిరూపించాయి. అలాంటి సినిమాల కోవలో ఈ “దేవినేని” ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రంలో నటించిన నటీనటులకు చిత్ర దర్శక నిర్మాతలు ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

బాక్స్ ఆఫీస్ చందు రమేష్ మాట్లాడుతూ..చిన్నప్పటి నుండి  నాలో కమ్యూనిజం బావాలు ఉండేవి ఆ భావాలు ఉన్న నాకు ఈ సినిమాలోకమ్యూనిజమ్ ఉన్న మంచి పాత్ర ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా కోసం శివ నాగు చాలా కష్టపడ్డారు. ఇందులో ఎమోషన్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి.ఈ సినిమా విజయం సాధించి దర్శక ,నిర్మాతలకు మంచి పేరు తీసుకు వస్తుందని అన్నారు.

లక్ష్మీ నివాస్ మాట్లాడుతూ…నాకు ఇందులో మంచి పాత్ర ఇచ్చారు. నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అని అన్నారు

ఇంకా ఈ కార్యక్రమంలో ,తుమ్మల పల్లి రామ సత్యనారామా సత్యనారాయణ ,,లిరిక్ రైటర్ మల్లిక్, లక్ష్మీ నరసింహ ఆదిత్యా మ్యూజిక్ నిరంజన్ లు చిత్రం విజయం సాధించాలని అన్నారు.

డైరెక్టర్ :-శివ నాగేశ్వరరావు(శివనాగు)
నిర్మాతలు :-జిఎస్ఆర్, రాము రాథోడ్
పి ఆర్ ఓ.:- మధు వి.ఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here