Cinemarangam.com
Review Rating 3/5
సినిమా : “సదా నన్ను నడిపే”
నిర్మాత– లంకా కరుణాకర్ దాస్,
కథ, స్క్రీన్ ప్లే, బేక్గ్రౌండ్ స్కోర్,దర్శకత్వంః లంకా ప్రతీక్ ప్రేమ్ కుమార్
నటీనటులు : ప్రతీక్ ప్రేమ్ కుమార్, వైష్ణవి పట్వర్దన్, నాగేంద్రబాబు, రాజీవ్ కనకాల, సూర్య, నవీన్ నేని, రంగస్థలం మహేష్, సుదర్శన్, ఆలమట్టి నాని తదితరులు
కెమెరాః ఎస్.డి. జాన్,
సంగీతంః ప్రభు, సుభాకర్,
ఫైట్స్- నందు,
ఆర్ట్- గోవిందు,
డైలాగ్స్– రూప్ కుమార్,
ఎడిటింగ్– ఎస్. ఆర్. శేఖర్.
పి.ఆర్.ఓ.– తేజు -వంశీ-శేఖర్.
‘ వానవిల్లు ‘ చిత్రం తర్వాత హీరో ప్రతీక్ ప్రేమ్ కరణ్ నటించిన చిత్రం ‘ సదా నన్ను నడిపే ‘. వైష్ణవి పట్వర్ధన్ హీరోయిన్. నాగేంద్ర బాబు, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ ఇతర ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమాకి చిత్ర హీరోనే దర్శకత్వం, స్క్రీన్ప్లే, సంగీతం అందించారు.ఈ చిత్ర ట్రైలర్ విడుదలయి కొన్ని గంటల్లోనే 3 మిలియన్ వ్యూస్ చేరింది. స్వచ్చమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ రోజు 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి
కథ:
యం.జె అలియాస్ మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సరదాగా స్నేహితులతో గడిపే కుర్రాడు. అతడు సాహా (వైష్ణవి పట్వర్దన్) ప్రేమలో పడతాడు. ఆమె ఎంత కాదన్నా ఎంతో సిన్సియర్ గా లవ్ చేస్తూ వుంటాడు. సాహా తండ్రి రాజీవ్ కనకాల కూడా యం.జె ప్రేమని అంగీకరించడు. అయితే యం. జె మాత్రం ఎలాగైనా సాహా ప్రేమని పొందాలని పరితపిస్తూ వుంటాడు. ఈ కార్యక్రమంలో యం.జె ప్రేమని…. సాహా అంగీకరించి వివాహం చేసుకుంటుంది. అయితే పెళ్ళైన మొదటి రోజు నుంచే యం.జె ని దూరం పెడుతూ ఉంటుంది. పెళ్లి చేసుకుని కూడా సాహా…యం. జె ని ఎందుకు దూరం పెడుతూ ఉంటుంది? ఆమె సమస్య ఏంటి? హీరో దాన్ని ఎలా పరిష్కరించాడు? వీరిద్దరూ చివరకి కలుసుకున్నారా? లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…!!!
నటీనటుల పనితీరు
హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ చాలా బాగా చేశాడు. తను నటిస్తూనే.. దర్శకత్వ బాధ్యలను చాలా సమర్థవంతంగా నిర్వహించాడు. హీరోయిన్ వైష్ణవి పట్వర్దన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అలీ ప్రేక్షకులచే బాగా నవ్వులు పుయించాడు. నాగబాబు, రాజీవ్ కనకాల, సూర్య, నవీన్ నేని, రంగస్థలం మహేష్, సుదర్శన్, ఆలమట్టి నాని తదితరులుతమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
చిత్ర హీరో చెప్పినట్టు ఇది ఓ వాస్తవ కథ. కర్నాటకలో జరిగింది. చిన్న అంశాన్ని తీసుకుని సినిమాటిక్గా మార్చాడు . ఒకవేళ ఆ సంఘటన ఇలా జరిగివుంటే ఎలా వుంటుందనేది ఆసక్తిగా తెరాకెక్కిస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా వుంది.ఇంతకు మునుపు స్వచ్చమైన, నిశ్వర్థమైన ప్రేమకథలతో గీతాంజలి, కలిసుందాం రా లాంటి సినిమాలు వచ్చి బాక్సాఫీస్ ని కళకళ లాడించాయి. ఇప్పుడీ చిత్రాన్ని కుడా హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ కరణ్… ఎంతో ఎమోషనల్ గా… ప్యూర్ లవ్ ట్రాక్ తో ఎంతో ఎంటర్టైనింగ్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. మనకు బాగా తెలిసిన వ్యక్తి చనిపోతున్నారని తెలిశాక వారితో వున్న కొద్దిక్షణాలను ఎంత మధుర జ్ఞాపకంగా గుర్తుపెట్టు కుంటామో అనేది ఇందులో చూపించారు. ప్రేమించిన వ్యక్తికోసం ఎలాంటి త్యాగాన్ని ఆయినా చెయ్యొచ్చు అని… ఇందులో ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించారు. దానికీ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో సంగీతం బాగుంది..విజయవాడ, హైదరాబాద్, కొడైకెనాల్, కులుమనాలిలో చిత్రీకరించిన లోకేషన్స్ బాగున్నాయి. నందు కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి..ఈ సినిమాను నమ్మి థియేటర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచకుండా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది అని చెప్పగలను.
Cinemarangam.com Review Rating 3/5