నిర్మాతల్లో ఒకరైన శరత్ మాట్లాడుతూ, మా టీమ్ అంతా వైజాగ్ వాసులమే. సాయిమంజ్రేకర్కు కథ చెప్పడానికి వైజాగ్ వచ్చాం. ఇప్పుడు మేజర్ సినిమా తీసి చూపించడానికి వచ్చాం. తెలుగు, హిందీలోనూ నిజాయితీగా చక్కటి సినిమా తీశాం. ఈ సినిమా జనాలకు చేరువవుతుందో లేదోనని భయంతో అందరికీ చూపించాలనే మార్చి 24 నుంచి స్క్రీనింగ్ వేశాం. అందులో భాగంగా ఈరోజు వైజాగ్ వచ్చాం. వైజాగ్ శరత్ థియేటర్లో వేశాం. మేజర్ సినిమా తీశాక ప్రమోషన్లో భాగం దేశంలో అన్ని ప్రాంతాలను పర్యటించినప్పుడు ప్రతిచోట గౌరవంగా చూస్తున్నారు. తెలుగువారు గొప్పవారుగా వారు ట్రీట్ చేస్తున్నారు అని చెప్పారు.
అడవి శేష్ మాట్లాడుతూ, ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్లో చేయడం చాలా ఆనందంగా వుంది. ఇంతకు ముందు ‘ఎవరు’, ‘గూఢచారి’ సినిమాలు హిట్ అవ్వాలని తీశాం. కానీ మేజర్ సినిమా మాత్రం సందీప్ జీవితం అందరికీ రీచ్ కావాలనే తీశాం. నేను సితార ఎంటర్టైన్మెంట్ బేనర్లో సినిమా చేస్తుండగా బ్రేక్ ఇచ్చి ఈ సినిమా చేశాం. ప్రమోషన్ బెటర్గా వుండాలని అందరికీ సినిమా చూపించాలనే నిర్ణయం తీసుకున్నాం. ఇండియన్ ఫిలిం హిస్టరీలో సినిమా విడుదలకు 10 రోజులు ముదుగా 10 సిటీలలో ఇలా సినిమా చూపించడం గొప్ప విషయం. ఒకవైపు పైరసీని నియంత్రించేవిధంగా చర్యలు తీసుకుంటూ సినిమా చూపించాం. మొదట ఇలా చేయాలని పూణేలో ప్రకటించినప్పుడు బుక్ మై షో టికెట్ల బుకింగ్ పెట్టాం. అక్కడ మేజర్ కర్నల్ ఫ్యామిలీ వచ్చింది. వారు చూశాక `ఇది కదా సందీప్ స్టోరీ` అన్నారు. నాకు గూజ్ బంప్స్ వచ్చాయని కర్నల్ అన్నారు. మేజర్ అనేది సినిమా కాదు ఎమోషన్. అహ్మదాబాద్లో సినిమా చూశాక `భారత్ మాతాకీ జై.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అమర్ రహే! అంటూ నినాదాలు చేశారు.
సాయిమంజ్రేకర్ మాట్లాడుతూ, వైజాగ్ రావడం చాలా ఆహ్లాదరకంగా వుంది. మూడేళ్ళనాడు ఇక్కడ వచ్చాను. మరలా ఇప్పుడు టీమ్తో కలిసి మీతో షేర్ చేసుకోవడం గొప్పగా వుంది అన్నారు.
దర్శకుడు శశికిరణ్ తిక్క మాట్లాడుతూ, తెలుగు సిటీలో ప్రమోషన్ మొదలైనందుకు ఆనందంగా వుంది. మీ రియాక్షన్ మాకు కావాలి. సినిమా చూడండి అని తెలిపారు.
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ, వైజాగ్లో కాలేజీలో నేను షోలు చేసేవాడిని. సినిమా రంగంలోకి వస్తానని అస్సలు అనుకోలేదు. నన్ను శేష్ నమ్మాడు. పాన్ ఇండియా సినిమా ప్రీరిలీజ్ వైజాగ్లో జరుగుతున్నందుకు ఆనందంగా వుంది. నా జర్నీ వైజాగ్లోనే పాటతో మొదలైంది. దర్శకుడు శశికిరణ్తో గూఢచారి నుంచి పనిచేస్తున్నాను. నేను 2007లో ఓ పాట కంపోజ్ చేశాను. దానికి ఇక్కడి మీడియా ఎంతో సపోర్ట్ చేసిందని అన్నారు.
కెమెరామెన్ వంశీ మాట్లాడుతూ, నేను ఇక్కడే చాలామందితో పనిచేశాను. నోవాటెల్లో ఇన్ హౌస్ యాడ్స్ చేశాను. నేను ఇక్కడే బుల్లయ్య కాలేజీలో చదివాను. శేష్ను కలిసింది కూడా వైజాగ్లోనే. ఇక్కడే ఫొటోగ్రాఫర్గా పనిచేశాను. శేష్ చేసిన ఎవరు సినిమా నా తొలి సినిమా. ఈరోజు మేజర్ చేసిన శేష్ సక్సెస్లో భాగమైనందుకు చాలా ఆనందంగా వుందంటూ.. నిన్ననే ఓ నదిలో ప్రమాదవశాత్తూ చనిపోయిన సైనికులకు శ్రద్దాంజలి ఘటిస్తూ సంతాపం తెలియజేవారు.
అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.