Hero Yash ‘KGF’ Chapter 2 Movie Review

Cinemarangam. com 
Review Rating ..3.5/5
బ్యానర్: హోంబలే ఫిల్మ్స్‌
నిర్మాత: విజయ్‌ కిరంగదూర్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రశాంత్‌నీల్‌
తారాగణం: యష్‌, శ్రీనిధిశెట్టి, సంజయ్‌దత్‌, ప్రకాష్‌రాజ్‌, రవీనాటాండన్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: భువన్‌ గౌడ
సంగీతం: రవి బస్రూర్‌
పి.ఆర్.ఓ : వంశీ కాక

కొలార్‌ బంగారు గనుల నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్‌ మూవీగా నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘కేజీఎఫ్‌’ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది.ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనివిధంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే..ఈ సినిమా కన్నడ నటుడు యష్‌కు పాన్‌ ఇండియా హీరో ఇమేజ్‌ను తీసుకొచ్చింది. భారీ వసూళ్లతో వాణిజ్యపరంగా కన్నడ సినిమా సత్తా ఏమిటో చాటిచెప్పింది.ఈ సినిమా తో దర్శకహీరోలు ప్రశాంత్‌నీల్‌, యష్‌ తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు.పార్ట్ 1 లోనే పార్ట్ 2 వుంటుందనే హింట్ ఇవ్వడంతో ఈ సినిమా సీక్వెల్‌ ‘కేజీఎఫ్‌-2’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న పాన్‌ ఇండియా మూవీగా విడుదలైన కేజీఎఫ్‌-2 తొలిభాగం మాదిరిగానే ప్రేక్షకులను ఏ మాత్రం ఏంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ..
కేజీఎఫ్‌ మొదటి భాగం ఎక్కడ ముగిసిందో రెండో భాగం కూడా అక్కడే మొదలవుతుంది. మొదటి భాగం కథను  జర్నలిస్ట్‌ ఆనంద్‌ వాసిరాజు (అనంత్‌నాగ్‌) చెప్పగా. రెండో భాగాన్ని ఆయన కొడుకు విజయేంద్ర వాసిరాజు (ప్రకాష్‌రాజు) చెబుతుంటాడు. కేజీఎఫ్‌ మొదటి భాగంలో రాఖీ భాయ్‌ (యష్‌). విలన్ గరుడను చంపి శత్రువులందరిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు.అలాగే నరాచి గోల్డ్‌ మైన్స్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు .ఆ మైన్ లో బానిసలుగా బతుకున్న కూలీల బతుకుల్లో వెలుగులు నింపుతాడు. ఇక ‘కేజీఎఫ్‌ చాప్టర్-2’లోకి వెళితే… నరాచిని హస్తగతం చేసుకున్న రాఖీభాయ్‌ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నాల్లో ఉంటాడు.

అక్కడ పనిచేసే తన మనుషులకు ఆయుధ శిక్షణ ఇప్పిస్తూ ఓ సైన్యంగా తయారు చేస్తుంటాడు. వారందరి అవసరాల్ని తీరుస్తుండడంతో గతం తాలూకు నరకం నుంచి బయటపడి స్వేచ్ఛగా బ్రతికే రోజులు రావడంతో అక్కడి ప్రజలు రాఖీభాయ్‌ని దేవుడిలా కొలుస్తుంటారు. నరాచిలో తనకు ఎదురే లేదనుకుంటున్న తరుణంలో చనిపోయాడని భావిస్తున్న అధీరా (సంజయ్‌దత్‌) తెరమీదికొస్తాడు. అధీర రాకతో కథలో కీలకమైన మలుపు చోటుచేసుకుంటుంది. దీంతో రాఖీభాయ్‌-అధీరా మధ్య పోరు ఆరంభమవుతుంది. ఈ పోరులో అధీర చేతిలో గాయపడ్డ రాఖీభాయ్‌ దుబాయ్‌ కు వెళతాడు.ఇదే అదనుగా ముంబయిలో ఉండే మాఫియా డాన్‌ శెట్టి కూడా రాఖీభాయ్‌ అడ్డు తొలగించుకోవాలని పావులు కదుపుతుంటాడు. ఇంతకి అధీరా ఎలా బ్రతికొచ్చాడు? గోల్డ్‌ మైనింగ్‌ సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న రాఖీభాయ్‌ని కట్టడి చేయడానికి ప్రధాన మంత్రి రమికాసేన్‌ (రవీనా టాండన్‌) ఎలాంటి చర్యలు తీసుకుంది? దుబాయ్‌లో ఉన్న ఇయాయత్‌ ఖలీని రాఖీభాయ్‌ ఎలా ఎదుర్కొన్నాడు? ఎన్నో ప్రతిబంధకాల మధ్య రాఖీభాయ్‌ ప్రయాణం ఎలా సాగింది? అన్నదే మిగతా సినిమా కథ..

నటీనటుల పనితీరు
రాఖీభాయ్‌గా యష్‌ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో తనదైన స్టెల్‌ కనబరిచాడు. తల్లి సెంటిమెంట్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో యష్‌ నటన కట్టిపడేస్తుంది.హీరోహీరోయిన్ల మధ్య తొలిభాగంలో వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు. ద్వితీయార్థంలో మాత్రం ఇద్దరి మధ్య బంధాన్ని హృద్యంగా ఆవిష్కరించారు. కథానాయిక పాత్రకు ద్వితీయార్థంలో ప్రాధాన్యత దక్కింది. కథను నరేట్‌ చేసే విజయేంద్ర వాసిరాజుగా ప్రకాష్‌రాజ్‌ తనదైన అభినయంతో మెప్పించాడు. అధీరా పాత్రలో సంజయ్‌దత్‌ చక్కటి విలనీ పండించారు. ఆయన ఆహార్యం భీతిగొలిపే విధంగా ఉంది. ప్రధానమంత్రి రమికాసేన్‌గా రవీనాటాండన్‌ మంచి నటనతో మెప్పించింది. సీబీఐ అధికారిగా రావు రమేష్‌ తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నారు.ఇంకా మిగిలిన వారందరూ కూడా తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు

సాంకేతిక నిపుణుల పనితీరు
తొలి భాగంలో జీరో నుంచి హీరోగా ఎదిగిన గ్యాంగ్‌స్టార్‌ రాఖీభాయ్‌ ఎదిగిన వైనాన్ని చూపించగా. సీక్వెల్‌ లో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి రాభీభాయ్‌ ఏం చేశాడన్నదానిపై దృష్టిపెట్టారు? ప్రతి అడుగులో పవర్‌ఫుల్‌ హీరోయిజం కనిపిస్తుంది.అంతర్జాతీయ స్థాయిలో రాఖీభాయ్‌ ఎలా ఎదిగాడనే అంశాల్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో రాఖీభాయ్‌ పాత్రను మరింత శక్తిసంపన్నుడిగా, రొమాంచిత మైన ఎలివేషన్స్‌తో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.మొదటిపార్ట్‌లో అమ్మ సెంటిమెంట్‌ హృదయానికి హత్తుకుంది.అమ్మ ఎమోషన్స్‌తో ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యారు.రెండో భాగంలో కూడా దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ ఇదే పంథాను ఫాలో అయ్యాడు..

క్లెమాక్స్‌ ఎపిసోడ్‌ హైలైట్‌ అని చెప్పొచ్చు. పతాకఘట్టాల్ని తల్లి సెంటిమెంట్‌తో జడ్జ్‌ చేసి చూపించడం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈ సినిమాకు మూడోభాగం కూడా ఉంటుందనే హింట్‌తో కథను ముగించడం ఆసక్తినిగా పెంచింది. ‘వాడు చనిపోతే మోసుకుపోవడానికి నలుగురు మనుషులు అవసరం లేదు..ఎందుకంటే పుట్టినప్పటి నుంచి సమాధి వరకు వాడు ఒక్కడిగానే అడుగులు వేశాడు’ వంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. తొలిభాగంలో మాదిరిగానే సీక్వెల్‌లో కూడా పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ వినిపించాయి. సాంకేతికంగా అత్యున్నత విలువలతో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా కేజీఎఫ్‌ గోల్డ్‌మైన్స్‌లోని విజువల్స్‌ కట్టిపడేస్తాయి. రవి బస్రూర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కథలోని ఫీల్‌ను చక్కగా ఎలివేడ్‌ చేసింది. ఓ రకంగా బీజీఎమ్‌ ఈ సినిమాకు పెద్దబలమని చెప్పొచ్చు. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్ లో విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించిన నిర్మాణ విలువలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. క్వాలిటీ విషయంలో  రాజీపడకుండా మంచి క్వాలిటీతోస్ ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన కేజీఎఫ్‌-2′ బాక్సాఫీస్‌ బరిలో ‘మరోమారు సంచలనాలకు సిద్ధమైందని చెప్పొచ్చు.

Cinemarangam. com. Review Rating  3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here