ఐకాన్స్టార్ అల్లు అర్జున్ ` క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. మొదటి భాగం ‘పుష్ప’ (ది రైజ్) క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వరుస బ్లాక్బస్టర్ చిత్రాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ప్రొడక్షన్ హౌస్తో కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సౌతిండియాలో టాక్ఆఫ్ సిల్వర్ స్క్రీన్స్లో ‘పుష్ప’ మూవీ కూడా ఒకటి. శుక్రవారం ‘పుష్ప’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతున్న సందర్భంగా క్రేజీ హీరోయిన్ రష్మిక పాత్రికేయులతో ముచ్చటించారు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘పుష్ప’ సినిమా పూర్తిగా మరో ప్రపంచం. చాలా కొత్తగా, క్యాచీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమాను అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. నాలుగు సినిమాలకు పడే కష్టం ఈ ఒక్క సినిమాకే పడింది మా టీమ్. ‘పుష్ప’లో పుష్పరాజ్కు ప్రేయసి అయిన శ్రీవల్లి పాత్రలో నేను నటించాను. ఇక శ్రీవల్లి ఉన్నదే పుష్పరాజ్ కోసం. ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.
శ్రీవల్లి పాత్ర కోసం ప్రత్యేకంగా చిత్తూరు యాస నేర్చుకున్నాను. కానీ సెట్లో డైలాగ్స్ మారినప్పుడు, అలాగే సీన్స్లో మార్పులు వచ్చినప్పుడు కూడా యాసను నేర్చుకుంటూనే ఉన్నాను. శ్రీవల్లి పాత్ర నాకు మంచి పేరు తీసుకొస్తుంది.
‘సామీ సామీ…’ సాంగ్ చేయడం నాకు చాలా కష్టమైంది. ఎందుకంటే డ్యాన్సింగ్ ఒకలా ఉంటుంది. అలాగే మూమెంట్స్, ఎమోషన్ మ్యాచ్ చేయాలి. పైగా సాంగ్లో మరో డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. దీంతో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది.
టాలీవుడ్లో నేను కలిసి పనిచేసిన మహేష్బాబు, అల్లు అర్జున్ పెద్ద స్టార్స్. ఇద్దరూ విభిన్నమైన వ్యక్తులు. అలాగే ఇద్దరి వర్కింగ్ స్టైల్స్ కూడా వేర్వేరుగా ఉంటాయి. ఇక నేను మహేష్ దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నా, బన్నీ దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాను.
‘పుష్ప’లో సమంత చేసిన స్పెషల్ సాంగ్లో ఆమె లుక్స్ స్టన్నింగ్గా ఉన్నాయి. అలాగే సామ్ డ్యా న్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ సాంగ్ కో సం నేనూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ ముగించారు.