ప్రముఖ నటి జయసుధ, నితిన్ కపూర్ దంపతులకు నిహార్ కపూర్, శ్రీయాన్ కపూర్ ఇద్దరు కుమారులున్నారు. నిహార్ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. నటి జయసుధ ఇటు వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరో పక్క రాజకీయాల్లోనూ చురుగ్గాపాల్గొంటున్నారు.వారిపెద్ద కుమారుడు నిహార్ వివాహం ఫిబ్రవరి 26న ఢిల్లీకి చెందిన అమృత కౌర్తో ఢిల్లీలో గ్రాండ్గా జరిగింది.ఈ శుభకార్యంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన విందుకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు కూడా హాజరై వధూవరులు నిహార్, అమ్రిత్ దంపతులను ఆశీర్వదించారు.ఈ వివాహ విందుకు సూపర్స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ దంపతులు, నాగార్జున దంపతులు, జాకీష్రాఫ్, కృష్ణంరాజు సతీమణి శ్యామల, మోహన్బాబు దంపతులు, రాజశేఖర్ జీవిత దంపతులు, టి. సుబ్బిరామిరెడ్డి దంపతులు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, పొట్లూరి వరప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, రాజమౌళి దంపతులు, పరుచూరి గోపాలకృష్ణ దంపతులు, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, నాగబాబు, దగ్గుబాటి సురేష్ బాబు, కృష్ణవంశీ, రమ్యకృష్ణ, దంపతులు, అలీ దంపతులు, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, రఘురామకృష్ణంరాజు, అరెకెపూడి గాంధీ, గంటా శ్రీనివాస్, బాబూ మోహన్, నరేష్, చలపతిరావు, బెనర్జీ, దిల్ రాజు, నమ్రత, బీవీఎస్ఎన్ ప్రసాద్, రాజా రవీంద్ర, అక్కినేని సుశీల, మంచు లక్ష్మి, శివబాలాజీ దంపతులు, హేమ, అనితా చౌదరి, శుభలేఖ సుధాకర్, వైవిఎస్ చౌదరి , జెమినీ కిరణ్, సుహాసిని, ప్రభ, ఖుష్బూ తదితర ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీనియర్ నటీమణులు తదితరులు హాజరై సందడి చేశారు.