ఖైదీ లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు దొంగ గా రాబోతున్నాడు. కార్తీకి వదిన, సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దొంగ’ ఫస్ట్ లుక్ ను ఇటీవలే హీరో సూర్య, టీజర్ ని కింగ్ నాగార్జున రిలీజ్ చేయగా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదల చేసిన సెకండ్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్ర ఆడియోను రేపు విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు.
యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్, సంగీతం: గోవింద్ వసంత, నిర్మాతలు: వయాకామ్ 18 స్టూడియోస్, సూరజ్ సదానా, దర్శకత్వం: జీతు జోసెఫ్.