భారీ అంచనాల నడుమ విడుదలైన మెగాస్టార్ చిరంజీవి యొక్క ‘సైరా’ చిత్రం నేటితో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం మెగా అభిమానుల్ని, తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.స్వాతంత్ర్యం కోసం తొలి సమరం ప్రారంభించిన వీరుడి కథ కావడం, ఆ పోరాటం కోసం ప్రాణాల్నే అర్పించడంతో ‘సైరా’ చిత్రం ఒక దేశభక్తుడి చిత్రంగా పేరు తెచ్చుకుంది. సినిమా చూసిన అందరూ కూడా తప్పక చూడాల్సిన చిత్రం అని మెచ్చుకున్నారు
నరసింహారెడ్డి పాత్రలో చిరు నటనకు తెలుగు జనం నీరాజనాలు పట్టారు. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా అనేక చోట్ల నాన్ బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసింది.మొత్తం 30 సెంటర్లలో సినిమా 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా మెగా అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన సినీ కేంద్రాల్లో ఈరోజు సాయంత్రం అర్థశతదినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మించారు.
కాగా ఈ నెల 21వ తేదీ నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో హెచ్డీ ప్రింట్ తో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది.ఇకపోతే ప్రస్తుతం చిరు కొరటాల శివ డైరెక్షన్లో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టే సన్నాహాల్లో ఉన్నారు.