డిసెంబర్ 21న తిరుపతిలో ‘పుష్ప’ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్
‘పుష్ప 2’ కోసం మేమంతా చాలా ఎగ్సైట్ గా ఎదురు చూస్తున్నాము. చిత్ర నిర్మాతలు
ఐకాన్స్టార్ అల్లు అర్జున్`రష్మిక జంటగా,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ప్రొడక్షన్ హౌస్తో కలిసి నిర్మించిన పాన్ఇండియా సినిమా ‘పుష్ప’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. అలాగే కలెక్షన్స్ విషయంలో రికార్డుల మోత మోగిస్తోంది.విడుదలైన మూడు రోజుల్లోనే 173 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి రేపు తిరుపతిలో గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని,వై.రవి శంకర్ మరియు సి.ఇ.ఓ చెర్రీ లు మాట్లాడుతూ..
‘‘ముందుగా మా ‘పుష్ప’ను అద్వితీయంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. పుష్ప సినిమా డిసెంబరు 17 కు రిలీజ్ అయ్యి అల్ టైం బ్లాక్ బస్టర్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది.అన్ని చోట్ల నుండి సెన్సెషన్ నంబర్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు 3 డేస్ కు 173 కోట్లు గ్రాస్ చేసింది. ఓవరాల్ గా 85 కోట్లు షేర్ చేసింది.ఈ రోజు మార్నింగ్ షోస్ కూడా హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఇంకా ఇది ఏ రేంజ్ కు వెళుతుందో ఊహించలేనంతగా ఉంది.తెలుగు రాష్ట్రాలే కాకుండా కేరళ, ఫస్ట్ 3 డేస్ 6 కోట్లు వసూలు చేసింది.తమిళనాడు లో 12 కోట్లు, కర్ణాటక లో 10 కోట్లు ,అలాగే 3 డేస్ లోనే హిందీ వెర్షన్ లో కూడా 12 కోట్లు చేయడం .అలాగే ఓవర్ సీస్ లో 2 మిలియన్స్ చేయబోతోంది.అన్ని చోట్ల నుండి చాలా మంచి రెస్పాన్స్ వన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత హ్యుజ్ రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. తెలుగు ప్రేక్షకులే కాక ఇండియా, ఓవర్ సీస్ మొత్తం మా సినిమాను ఆధరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి మేము రేపు తిరుపతిలోని యస్.వి యూనివర్సిటీ గ్రౌండ్స్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశాము. అల్లు అర్జున్ ఫ్యాన్స్, మరియు ఈ సినిమా అభిమాను లందరూ అక్కడికి రావాలని ఇన్విటేషన్ ఇస్తున్నాము. మార్చి నుండి ”పుష్ప 2” షూటింగ్ మొదలు పెడతాము. మేమంతా ‘పుష్ప 2’ కోసం చాలా ఎగ్సైట్ గా ఎదురు చూస్తున్నాము అన్నారు.