ఈ సంవత్సరం గోవాలో సంతోషం ఫిలిం అవార్డ్స్ నిర్వహిస్తున్న సందర్భంగా సంతోషం అధినేత సురేష్ కొండేటి గారు మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 2న గోవాలో సంతోషం ఫిలిం అవార్డ్స్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నాం మాకు సహకరిస్తున్న మీడియా ఇండస్ట్రీ మిత్రులు జర్నలిస్టులు అందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే అందరు హీరోలు అభిమానులకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంతోషం ఓటీటీ అవార్డ్స్ కూడా మొట్టమొదటిగా మొదలుపెట్టింది సంతోషం సంస్థని అదే ఈ సంవత్సరం కూడా ఈ నెల 18వ తారీఖున ఓటీటీ అవార్డ్స్ ని అలాగే డిసెంబర్ 2న గోవాలో సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సంతోషం సంస్థ నుంచి 20 సంవత్సరాలు పాటు అవార్డులు కొనసాగించాలని అనుకున్నాను ఇప్పటికి 20 సంవత్సరాలు దగ్గర అయింది ఇంకో మూడు సంవత్సరాలు కచ్చితంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాం ఆ తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి అని అన్నారు. సంతోషం మ్యాగజైన్ మొదలెట్టినప్పుడు నాకు ఇంకా చిన్న వయసు నాగార్జున గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు లాంటి అగ్రతాలు ఇచ్చిన ప్రోత్సాహంతో అవార్డ్స్ మొదలుపెట్టాను టాలీవుడ్ కింగ్ నాగార్జున గారు సంతోషం సురేష్ కొండేటి కూడా ఫిలింఫేర్ స్థాయిలో అవార్డ్స్ నిర్వహించగలడు ఆయన నా పై ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలనుకున్నాను.
అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు లాంటి అగ్ర హీరోలు సురేష్ కొండేటి చేయగలడు అని నా పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇన్నాళ్లు వరకు సంతోషం ఫిలిం అవార్డ్స్ ఎక్కడ ఆగకుండా నిర్వహించాను నిర్వహిస్తున్నాను అని అన్నారు. అలాగే గోవా గవర్నమెంట్ నుంచి మంచి సహకారం అందింది ముందుగా ఈ నెల 18న అనుకున్నాం కానీ గోవాలో టోర్నమెంట్ ఉండటం వల్ల అక్కడ గవర్నమెంట్ నుంచే ఒక లేఖ డిసెంబర్ 2 కి పెట్టుకోమని వచ్చింది. గోవా గవర్నమెంట్ వాళ్ళు సహకారం అందించడం అలాగే ఆ గవర్నమెంట్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.