ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `సూర్యాస్తమయం`. శ్రీహార్సీన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై బండి సరోజ్ దర్శకత్వంలో క్రాంతి కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి ప్రేక్షకులు మరియు విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది.
నిర్మాత క్రాంతికుమార్ తోట మాట్లాడుతూ “పదేళ్ల ముందు నిర్మాతగా చేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమా చేస్తున్నాను. `సూర్యాస్తమయం` సినిమా చేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, అలాగే ఈ మూవీ ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి మంచి స్పందన లభిస్తుంది, ఈ మూవీ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ ఈ మూవీ గురించి తప్పుడు వార్తలు సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ చూడవద్దు అని అలాగే ఈ మూవీ లో నటించిన ఆరిస్టులని కూడా మూవీ ప్రమోషన్స్ కూడా రానివ్వకుండా అడ్డుపడుతున్నారు, అలాగే బండి సరోజ్ తను గతం లో చేసిన మూవీ కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ప్రేక్షకులను మైండ్ సెట్ డైవర్ట్ చేసి క్యాష్ చేసుకున్నాడు, మా అందులోన ఏమిటీ అంటే తన దగ్గర వున్న మూవీ రష్ స్ ని పార్ట్ లు పార్ట్ లు గా ఎక్కడ ఈ మూవీ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడో ఏమో అని మీడియా మిత్రులందరికీ తెలియచెప్పాలనే మా ప్రయత్నం.
ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ మూవీ కి మంచి స్పందన వస్తుంది, హీరో గా ఈ ఇష్యూ గురించి నేను మాట్లాడకూడదు కానీ ప్రొడ్యూసర్ నష్టపోతుంటే నేను స్పందించ వలసి వచ్చింది, ఫస్ట్ ఈ మూవీ ని ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి రిలీజ్ చేయాలి అని కొన్ని కారణాల వల్ల రిలీజ్ చేయలేక పోయారు, బండి సరోజ్ కుమార్ అనే వ్యక్తి ఈ మూవీ ని డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రొడ్యూసర్ కి మూవీ చూపించాలి అని చెప్పి మా దగ్గర డబ్బులు వసూల్ చేసుకున్నాడు, ఈ మూవీ ని చాలా రకాల గాసినిమా ని డామేజ్ చెయ్యాలి అని తన సోషల్ మీడియా వేదిక గా ఈ మూవీ చూడవద్దు అని చెప్తున్నాడు, దయచేసి ఈ విషయాన్ని మీడియా ద్వారా అందరకి తెలియచేసి నిర్మాత కు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ రఘు గారు మాట్లాడుతూ మా సూర్యస్తమయం సినిమాకి మంచి స్పందన వచ్చింది, ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మా ధన్యవాదములు, ఇంతటి విజయాన్ని అందుకున్న ఈ సినిమాని డామేజ్ చేయటానికి మా డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా గా ఈ మూవీ ని చూడవద్దు, ఈ మూవీ ని తన ప్రమేయం లేకుండా ఎడిట్ చేశారు అని తప్పుడు వార్తలు చెపుతున్నారు, ఈ సినిమా ని ఆడనివ్వకుండా చేయాలనీ చూస్తున్నారు దయ చేసి మా విన్నపాన్ని అర్ధం చేసుకోవాలి అని మీడియా ద్వారా కోరుకుంటున్నాము.
నటీనటులు:
ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమాన్షి, కావ్యా సురేశ్పెద్ద వంశీ, ప్రేమ్ కుమార్ పాత్రో, మాస్టర్ రక్షిత్, మాస్టర్ చరణ్, మోహన్, వివేక్ థాకూర్, నందగోపాల్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: శ్రీహార్సీన్ ఎంటర్టైన్మెంట్
సంగీతం, పాటలు, స్టంట్స్, ఎడిటింగ్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: బండి సరోజ్
నిర్మాత: క్రాంతి కుమార్ తోట.