“Pelli Parugu” first poster released on the occasion of Dussehra

సాషా ప్రొడక్షన్స్ పతాకంపై శరవణ సోహాయుంగ్ హీరోగా దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “పెళ్లి పరుగు”. ఈ చిత్రాన్ని దివ్య శ్రీ, హీరాని, ఎస్.పి రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది పెళ్లి ఫోటోలు తీసే కొడుకుకి, ఒక తండ్రికి మధ్య జరిగే కథ. సహజమైన కథ, కథాంశంతో ఉల్లాసంగా నవ్వుకునే కామెడీ సన్నివేశాలతో జరిగే పెళ్లి వేడుకే ఈ “పెళ్లి పరుగు” కథ. దసరా పండగ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సందర్భంగా చిత్ర హీరో, దర్శకుడు శరవణ సోహాయుంగ్ మాట్లాడుతూ “పెళ్లి పరుగు” అందమైన కుటుంబ కథ. సినిమా చాలా సహజంగా ఉంటుంది. సినిమా షూటింగ్ పూర్తి అయింది. దసరా పండగ సందర్భగా మా చిత్రం మొదటి పోస్టర్ ను విడుదల చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు” అని తెలిపారు.

చిత్రం పేరు: పెళ్లి పరుగు

బ్యానర్: సాషా ప్రొడక్షన్స్

నటి నటులు: శరవణ సోహాయుంగ్, మానస నారాయణ్, కిట్టయ్య, చిత్తూరు కుర్రాడు, ఎస్ పి రాజా, తదితరులు

కెమెరా మాన్ : దిలీప్, సాయి కృష్ణ

ఎడిటర్ : లక్ష్మి నారాయణ, దివ్య శ్రీ

పి అర్ ఓ : పాల్ పవన్

నిర్మాతలు : దివ్య శ్రీ, హీరాని, ఎస్ పి రాజా

సంగీతం, కథ, దర్శకత్వం : శరవణ సోహాయుంగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here