Review Rating. 3.5/5
బ్యానర్ : డి వి.వి.ఏంటర్ టైన్మెంట్స్
చిత్రం : “RRR”
నిర్మాత: డి వి.వి. దానయ్య
దర్శకత్వం– ఎస్ఎస్ రాజమౌళి
నటీనటులు– ఎన్టీఆర్, రామ్చరణ్ తేజ్, ఆలియాభట్, అజయ్ దేవగణ్, శ్రేయ,హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రేస్టీవెన్ సన్, అలిసన్ డూడి, సముద్రఖని,రాజీవ్ కనకాల తదితరులు
సంగీతం– యం యం కీరవాణి
కెమెరా– కె కె సెంథిల్ కుమార్
కథ– విజయేంధ్ర ప్రసాద్
మాటలు– బుర్రా సాయిమాధవ్
ఎడిటర్ : శ్రీకర్
పి.ఆర్.ఓ : వంశీ కాక
భారతదేశ స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్, అల్లూరి సీతా రామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని రూపొందిన ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ‘‘RRR” (రణం రౌద్రం రుధిరం)’. హైదరాబాద్ తో పాటు ప్రపంచంలోని పలు ప్రదేశాల్లో భారీ సెట్స్ వేసి చిత్రీకరించిన ఈ మూవీ ప్రేక్షకులను మరో కాలానికి తీసుకెళుతుంది. జాతీయ స్థాయిలో అతి పెద్ద మల్టీస్టారర్ మూవీగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్, బాలీవుడ్ స్ఠార్స్ అలియా భట్, అజయ్ దేవగణ్,హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రేస్టీవెన్ సన్, అలిసన్ డూడిలు నటిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనా లాక్డౌన్, టికెట్ రేట్ల సమస్యలు, వైరస్ బారిన పడడం, గాయాలవ్వడం వాయిదాల పర్వం ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కుని ఎట్టకేలకు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల ఉత్కంఠ కు తెరదించుతూ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25 న ఎన్నో వేల స్క్రీన్లలో ప్రేక్షకుల ముందుకొచ్చిన “RRR” (రణం రౌద్రం రుధిరం) చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.
కథ…..
స్వాతంత్రానికి పూర్వం 1920లో మనదేశం బ్రిటీష్ వాళ్లు పాలిస్తున్న రోజులవి. హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబుల పరిపాలనలో ఉన్న తెలంగాణలోని ఓ గిరిజన ప్రాంతం అదిలాబాద్ జిల్లాలో “RRR” కథ ప్రారంభం అవుతుంది. నిజాంను కలవడానికి వచ్చిన ఓ బ్రిటిష్ దొర (రే స్టీవెన్సన్), గోండు జాతికి చెందిన ఓ పచ్చబొట్లు పొడిచే మల్లి అనే చిన్న పిల్లను బ్రిటిష్ ఆఫీసర్ భార్య తమతోనే ఉంచుకుందామని బలవతంగా తీసుకువెళ్తుంది.ఇది అన్యాయమని ఎదిరించిన ఆ చిన్నారి కుటుంబాన్ని హింసిస్తారు.తన జాతి గౌరవం కోసం శ్వాసనైనా విడిచే గోండు జాతికి కాపరి లాంటి కొమరం భీమ్ (ఎన్టీఆర్)కి ఈ విషయం తెలుస్తోంది.ఆ పాపను కాపాడటానికి భీమ్ డిల్లీ బయలుదేరతాడు.విశాఖపట్టణం సమీపానికి చెందిన రామరాజు (రామ్చరణ్) చిన్నతనం నుంచీ పోరాడే తత్వం ఉన్న రామరాజుకు పోలీస్ కావాలన్న ఆసక్తి. అందుకు తగ్గట్టుగానే పెరిగి పెద్దయ్యాక నాటి బ్రిటిష్ గవర్నమెంట్ లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. చాలా పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకుంటాడు.దాంతో కొమురం భీం ను ఎలాగైనా పట్టుకునే బాధ్యతను బ్రిటీష్ ప్రభుత్వం సీతారామరాజుకు అప్పగిస్తోంది.
నటీనటుల పనితీరు
ఎన్టీఆర్, రామ్చరణ్ లిద్దరూ ఎంట్రీ సీన్లలలో పోటీపడి అద్భుతంగా నటించారు.మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భీమ్ పాత్రకి వంద శాతం న్యాయం చేశాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలలో తారక్ మరియు రామ్ చరణ్ నటించారని చెప్పడం కన్నా జీవించారని చెప్పవచ్చు. ఉక్రెయిన్ రాజభవనంలో తీసిన ‘నాటు నాటు’ పాటలో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన తీరు మహా అద్భుతం. ఇక బాలీవుడ్ స్టార్ అలియా భట్ సీత పాత్రలో ఒదిగిపోయింది. సీతగా నటించిన పాత్ర నిడివి తక్కువే. కానీ, తెరపై కనిపించిన ప్రతిసారీ చక్కటి ఎమోషన్ పండిస్తూ అద్భుతంగా నటించింది. సీత పాత్రకు ఆమె అభినయం ప్లస్ అయ్యింది.ఒలీవియా మోరిస్ అందంగా కనిపించారు.అజయ్ దేవగణ్ పాత్ర నిడివి కూడా తక్కువే కానీ, సినిమాకి కీలకం. శ్రియ సరన్ చిన్న పాత్రలో మెరిసినా ఆకట్టుకుంది సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రావురమేష్, రాజీవ్ కనకాల తదితరులు తమతమ పాత్రల పరిధి మేర చక్కటి నటన ప్రదర్శించారు.
ఎలాంటి కథైనా తెరపై పండాలంటే దానికి కథనం చాలా గొప్పగా ఉండాలి. అలాంటి గొప్ప కథలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు రాజమౌళి. హిస్టరీలో ఎక్కడ కలుసుకోని ఇద్దరి చరిత్రకారుల అభూత కల్పనే “RRR” (రౌధ్రం, రణం, రుధిరం), ఇద్దరు సూపర్ స్టార్లతో సినిమాలు తీయటం అంటే మాటలు కాదు..రాజమౌళి ఏ సినిమా తీసినా, దానిని జనం మెచ్చేలా వేరే లేవల్లో తీసుకువెళతాడనేది మరోసారి నిరూపించారు .అల్లూరి సీతారామరాజు, కొమురుం భీమ్ వంటి ఇద్దరు అమరవీరులు తాము నమ్మిన మంచి కోసం కలిసి పనిచేశారు అనే ఫిక్షనల్ సినిమాగా తెరపై అద్భుతంగా చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు.ఆయనకి ఎన్టీఆర్, రామ్చరణ్లాంటి మంచి నటులు కూడా తోడయ్యారు. వాళ్ల అభినయం సినిమాని మరో మెట్టు ఎక్కిస్తుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ఆద్యంతం హృదయాల్ని పిండేసేలా ఉంటాయి. మామూలుగానే కొన్ని సన్నివేశాలు తెరపై చూస్తోంటే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. నిప్పు, నీరు..అంటూ రెండు శక్తుల్ని పరిచయం చేస్తూ రామ్చరణ్ని అత్యంత సహజమైన లాఠీఛార్జ్ యాక్షన్ ఘట్టంతో పరిచయం చేసిన విధానం, అందులో ఆయన నటించిన తీరు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పులితో కలిసి చేసే విన్యాసాలతో సినిమాని ఆరంభించారు దర్శకుడు.అయితే ఆ ఇద్దరి మధ్య స్నేహం చిగురించినట్టుగానే, వైరం కూడా మొదలవు తుంది.రెండు శక్తులు ఒకదానికొకటి తలపడితే అది ఎంత భీకరంగా ఉంటుందో చూపిస్తూ రామరాజు, భీమ్ మధ్య సన్నివేశాల్ని తీర్చిదిద్దారు దర్శకుడు.