శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో 118 చిత్రంతో డిఫరెంట్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ హీరోగా ,మెహ్రీన్,నటశాదోషి హీరోయిన్స్ గా శతమానం భవతి చిత్రం తో ట్రేడ్ మార్క్ సంపాదించిన సతీష్ విగ్నేష్ దర్శకత్వం లో ఉమేష్ గుప్త,సుభాష్ గుప్త లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎంతమంచి వాడవురా”…గోపిసుందర్ సంగీత దర్శకత్వం అందిస్తున్నారు..
అయితే చిత్ర బృందం ఇటీవలే హీరోయిన్ నటశా దోషి-కళ్యాణ్ రామ్ మధ్య సాంగ్ ని,గోదావరి-రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఫైటింగ్ షెడ్యూల్ పూర్తి చేసింది..
సంక్రాంతి బరిలో మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు”,రజినీకాంత్ “దర్బార్”,అల్లుఅర్జున్ “అల వైకుంటపురములో”చిత్రాల నిర్మాతలు సంక్రాంతి కి విడుదల చేస్తామని ప్రకటించారు.కానీ “ఎంతమంచి వాడవురా”చిత్ర యూనిట్ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రేక్షకులలో ఈ చిత్రం సక్రాంతి కి వస్తుందా,రాదా అన్న అనుమానాలు మొదలయ్యాయి,వారి అనుమానాలకు కళ్యాణ్ రామ్ స్వయంగా స్పందిస్తూ మా చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్బంగా జనవరి 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు..