“Dhoom Dhaam” will have a paid premiere show in Visakhapatnam on oct 29th, Movie releasing on Nov 8th

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నవంబర్ 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఈ నేపథ్యంలో ఈ నెల 29న విశాఖపట్నం మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్ లోని ఐనాక్స్ మల్టీప్లెక్స్ లో “ధూం ధాం” సినిమా పెయిడ్ ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. రాత్రి 7.30 గంటలకు ఈ పెయిడ్ ప్రీమియర్ షో ప్రారంభం కానుంది. “ధూం ధాం” సినిమా నుంచి రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. రీసెంట్ గా డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ పై క్రేజ్ ఏర్పడుతోంది.

నటీనటులు – చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు

టెక్నికల్ టీమ్

డైలాగ్స్ – ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ – విజయ్ బిన్ని, భాను
లిరిక్స్ – సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్ – రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ – అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్ – రఘు కులకర్ణి
ఎడిటింగ్ – అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ – గోపీ సుందర్
స్టోరీ స్క్రీన్ ప్లే – గోపీ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ కుమార్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ – ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ – సాయి కిషోర్ మచ్చా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here