ప్రముఖ నిర్మాత ప్రతాప్ కోలగట్ల (3G Love) కరోనా సహాయ కార్యక్రమాలు కోసం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ₹ 1 లక్ష ప్రకటించారు. ప్రస్తుతం కరోన మహమ్మారి రెండో దశకి చేరడంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కర్ఫ్యూ అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందువల్ల జనం ఇళ్లకే పరిమితం అవ్వడంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందడుగు వేసి వచ్చే నెల నుండి ఫ్రీ రేషన్ తో పాటు కొంత డబ్బును పేద కుటుంబాలకు ఆర్థిక సాయంగా అందించనున్నట్టు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ నిర్మాత ప్రతాప్ కోలగట్ల 1 లక్ష రూపాయిలు ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరుపున ప్రకటించిన ఆర్ధిక సహాయం తనకు ఏంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.
అతి త్వరలోనే ప్రకటించిన అమౌంట్ అందజేయనున్నారు.