పేద సినీ కళాకారులు, కార్మికులను ఆదుకోవడంలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ భాగస్వాములయ్యారు.ప్రస్తుతం నడుస్తున్న సంక్షోభ కాలంలో సినిమా షూటింగ్లు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సినీ కార్మికులకు చేయూత నిచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ఛైర్మన్గా ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి సీనియర్ నటుడు బ్రహ్మాజీ రూ.75,000 విరాళంగా ప్రకటించారు.
కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం కీలక దశలో ఉందనీ, దీన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన 21 రోజుల లాక్డౌన్ను అందరూ గౌరవించాలనీ,ఈ లాక్ డౌన్ మనకి అత్యంత అవసరం అని, వైద్యులు, పోలీసుల సూచనలను పాటిస్తూ, అందరూ తమ ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ సీనియర్ నటుడు బ్రహ్మాజీ కోరారు.