మహమ్మారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటు, ఆసరా కోసం ఎదురుచూస్తున్న తెలుగు చిత్ర కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలుగు రాష్ట్రాలు పోరాడుతున్న విషయం తెలిసిందే.ఈ పరిశ్రమలోని కార్మికులకు చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం కు ప్రముఖ కమెడియన్ మరియు హీరో సప్తగిరి 2 లక్షల రూపాయల విరాళాన్ని ఈరోజు ప్రకటించారు.
ఈ సంక్షోభ సమయంలో అందరూ సురక్షితంగా ఉంటారనీ, మీ గురించి మీరు శ్రద్ధ వహిస్తారనీ ఆశిస్తున్నా. కోవిడ్-10 వ్యాప్తిని అదుపు చేయడానికి మనదేశం అత్యంత ముఖ్యదశలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో, అహర్నిశలూ ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తూ వస్తోన్న వైద్య సిబ్బందికీ, పోలీస్ డిపార్ట్మెంట్కూ, ఈ క్లిష్ట కాలంలో తమ వంతు సేవలు అందిస్తూ వస్తోన్న ప్రతి వ్యక్తికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ ఆరోగ్యం కంటే దేశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న మీకు తగినవిధంగా కృతజ్ఞతలు చెప్పుకోగలనని నేను అనుకోవట్లేదు.
అంతే కాకుండా, ఒకరికొకరం.. అది చిన్నదైనా సరే.. సాధ్యమైనంత వరకు సాయం చేసుకోవాలి, మానవజాతిగా ఐక్యంగా ముందుకు సాగాలి. నా వంతుగా.. రూ. 2 లక్షలు విరాళంగా అందజేస్తున్నాను.
ప్రస్తుతం అమలులో ఉన్న లాక్డౌన్ను దయచేసి పాటించాలని ప్రతి ఒక్కరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రానున్న కొద్ది వారాలు మన దృష్టి పూర్తిగా సామాజిక దూరంపై కేంద్రీకరించాలి. మన ఆరోగ్యపరిరక్షణ వ్యవస్థపై ఎలాంటి ఒత్తిడీ లేకుండా చూసుకోవాలి. చివరగా ఈ మహమ్మారిపై విజయం సాధించాలి. శక్తిమంతంగా ఉండాలని హీరో సప్తగిరి అన్నారు..