కరోనా కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని,రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలందరూ సహకరించాలని కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో తన వంతు భాగస్వామ్యం అందించాలని సాయి ఏజీఎన్ సేవా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ మరియు మా మాజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ప్రముఖ నటుడు వెంకట్ గోవిందరావు ఆయన సతీమణి నిమ్స్ పి ఆర్ ఓ వై. ఆశారాణి సంయుక్తంగా శనివారం ఉదయం దూర ప్రాంతాల నుంచి వచ్చి ఫిల్మ్ నగర్లో నివాసముంటున్న వారిలో 60 కుటుంబాలకు నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.లాక్డౌన్కు ప్రజలు సహకరించాలనీ, అందరూ తమ తమ ఇళ్లల్లోనే ఉండి, కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడంలో పాలు పంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లో నిర్మాత, సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి పాల్గొన్నారు.