కాటమరాయుడు తర్వాత శృతిహాసన్ దాదాపు రెండున్నరేళ్లు సినిమాలు తీయకుండా టాలీవుడ్ కు దూరంగా ఉంది. టోటల్ గా సినిమాలకు బ్రేక్ తీసుకుంది ఈ అమ్మడు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తుంది శృతిహాసన్. రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీని ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ రవితేజకు 66వ మూవీ. మళ్లీ రవితేజతో కలిసి నటిస్తున్నందకు తనకు ఎంతో ఉత్సాహంగా ఉందని ట్వీట్ చేసింది. అటు తమిళంలో కూడా విజయ్ సేతుపతి హీరోగా ఎస్ పి జననాథన్ డైరెక్షన్ లో లాభం అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది శృతిహాసన్.