‘‘విజయ్ వాళ్ల నాన్న గోవర్థన్తో వర్క్ చేశాను. చాలామంచి వ్యక్తి. ఈ చిత్రం ట్రైలర్ చూశాను, బావుంది. సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ చిత్రంతో పాటు విజయ్ చేస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవ్’ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు పూరి జగన్నాథ్. ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్భాస్కర్ హీరోగా ఆ చిత్ర హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా షామీర్ సుల్తాన్ దర్శకునిగా చేసిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’.
ఈ వేడుకలో పూరి జగన్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి. సురేశ్బాబు మాట్లాడుతూ– ‘‘విజయ్, తరుణ్ ఎదిగిన తీరు చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది. ఈ చిత్రం ట్రైలర్ చూశాను. చాలా బాగుంది’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఐదారేళ్ల క్రితం టీవీలో సెలబ్రిటీలందరినీ చూసి నటుడవ్వాలనే కోరిక ఉండేది. అప్పుడు మా నాన్న నన్ను పూరిగారి దగ్గర వర్క్ చేయమని చెప్పారు. ఇప్పుడు నేను పూరిగారితో వర్క్ చేయటం మర్చిపోలేని అనుభూతి. కలలు కనండి, వాటిని నిజం చేసుకోవటానికి కష్టపడండి.
నన్ను చాలామంది సపోర్ట్ చేయటంతో ఈ స్థానంలో ఉన్నాను. అందుకే నేను కొత్తవారిని సపోర్ట్ చేస్తున్నాను. నా సక్సెస్కు కారణం సందీప్రెడ్డి వంగా. నిర్మాత సురేశ్బాబు గారు నా మొదటి సినిమా నుండి సపోర్ట్ చేస్తున్నారు’’ అన్నారు.