దుమ్ము- ధూళి…నేనేరా ఇక మీద ఉన్న చోటే దర్బారు.. ఉన్నా నీ గ్యాంగు నేనేరా లీడు….అంటూ రజినీకాంత్ ‘దర్బార్’ ఎలా రౌడీల అంతు చూడబోతున్నారు అనే విషయాన్ని తెలిపే విధంగా సాగే ఈ మాస్ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రమణ్యం తనదైన శైలిలో ఆలపించారు. రజిని మాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ పాట ఆయన స్టైల్ కు తగ్గట్టుగా ఫాస్ట్ బీట్లో ఉండేలా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ స్వరపరిచారు. ఈ పాటతో అనిరుద్ మరోసారి తన మాస్ అప్పీల్ను చూపించాడు. ‘దర్బార్’ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్ పక్కా మాస్ సాంగ్ కావడంతో రజిని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు
రజనీకాంత్ దాదాపు ఇరవై ఏళ్ళ తరువాత చేస్తున్న పోలీస్ పాత్ర ఇది.దర్బార్ చిత్రం కోసం ముంబై పోలీస్ స్టేషన్ లో ఐపీఎస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచాలంగా ఛార్జ్ తీసుకొన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్.. నయనతార కథానాయకిగా,రజినీకాంత్ కూతురిగా నివేథా దామస్ గా నటించారు..
సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్మురుగదాస్ల ఫస్ట్ క్రేజి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్తో, హైటెక్నికల్ వాల్యూస్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రజిని పోస్టర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా జనవరి 9 న రిలీజ్ చేయనున్నారు