కరోనా కట్టడి కోసం భారత ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ తో నిస్సహాయులైపోయిన పేదలకు సహాయసహకారాలందించడంలో “మనం సైతం” అందరికంటే ముందుగా స్పందించిన సంగతి విదితమే!“మనం సైతం” నిత్యావసర వస్తువుల రూపంలో సేవలు అందించిన సినీ కార్మికుల/పేదల సంఖ్య నేటికి (25-4-2020) ‘3000’ కి చేరువ కావటం గర్వించదగిన విషయం! ఈ సందర్భంగా సేవలు అందుకున్న పేదలు మనసారా దీవిస్తుండగా.. పెద్దలు వెన్నుదన్నుగా నిలవడం ..”మనం సైతం”సేవలను మరింత విస్తృతం చేయడానికి ధైర్యాన్నిచ్చింది! అందరి మద్దతుతో నిరంతరం నలుచెరగులా.. తమ సేవలను కొనసాగిస్తూనే ఉంటామని “మనం సైతం” వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు!!