ఇండియాలోనే మొట్ట మొదటి సారిగా గ్రీన్ విగ్రహాన్ని మన హైదరాబాద్ నాగోల్ లో 5000 వేల మొక్కలతో గ్రీన్ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.గ్రీన్ గణేశునికి తొమ్మిది రోజులు పాటు హాట్టహసంగా పూజలు జరుగుతాయి

గ్రీన్ గణేష్ నీ దర్శించుకునే ప్రతి భక్తుడికి ప్రసాదంగా ఒక మొక్క ను నిర్వాహకులు ఇస్తున్నారు.నిమజ్జనం రోజు పూజలు అందుకున్న వినాయకుడి విగ్రహం లోని మొక్కలను భక్తులకు పంచాలని ఇండియాలోని అందరూ మొక్కలు పెంచి పచ్చదనంతో ఆరోగ్యమైన గాలి పీల్చుకుని ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేలా ఆ గణేశుని ఆశీస్సులు మన అందరిపైనా ఉండాలి అని కోరుకుంటున్నాము అని
నిర్వాహకులు తెలిపారు.









