Director Kiranmayi Indiraganti Feature Film Rallalo Neeru

అనేక డాక్యుమెంటరీలు తీసి,చాలా రచనలు చేసి,సినిమా పై మంచి పరిజ్ఞానం కలిగిన కిరణ్మయి ఇంద్రగంటి  తొలి సారిగా డైరెక్ట్  చేసిన చిత్రం  ‘రాళ్ళలో నీరు‘. అనల్ప అండ్ ఫ్రెండ్స్ పతాకంపై అనల్ప  చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ మంజూష,అల్తాఫ్,షఫీ,బిందు చంద్రమౌళి,డాప్రసాద్  ఇందులో ప్రధాన తారాగణం

దర్శకురాలు కిరణ్మయి ఇంద్రగంటి మాట్లాడుతూ ”నేను M.A ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకునే రోజుల్లో నార్వేజియన్ నాటకం ‘ఏ డాల్స్ హౌస్’ విపరీతంగా ఆకట్టుకుంది.ఎప్పటికైనా ఆ నాటకాన్ని తెరకెక్కించాలనుకున్నాను.ఆ కల ఇప్పటికి నెరవేరింది. తెలుగులో ‘కన్యాశుల్కం’ ఎలానో,ఇంగ్లీషులో ‘డాల్స్ హౌస్’ అంత ఫేమస్.19వ శతాబ్దానికిచెందిన ప్రముఖ రచయిత హెన్రిక్ ఇబ్సన్ ఈనాటకం రాసారు.చలం తరహాలో ప్రోగ్రెసివ్థాట్స్ తో ఉండే ఈనాటకం థీమ్ని తీసుకుని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసాను.ఇందులో మొత్తం ఐదు పాత్రలే ఉంటాయి.మనుషుల్లో అంతర్గతంగా ఉండే లోపాల్ని,భావోద్వేగాల్ని ఒడిసిపట్టే విధంగా ఇందులో కథాంశం ఉంటుంది.కథకు తగ్గట్టుగా కాకినాడలో ఓ ఇల్లు దొరికింది.మేజర్ పోర్షన్ అక్కడే చిత్రీకరించాం.కాకినాడలో మొత్తం 28రోజులు షూటింగ్ చేశాం.ఫస్ట్ కాపీ తో సహా సినిమా రెడీ గా ఉంది.ఇటీవలే లాస్ ఏంజిల్స్ లో జరిగిన అవేర్నెస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్నిప్రదర్శించాం.చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం”అని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, ఎడిటింగ్: మార్తాండ్ . కే. వెంకటేష్, కెమెరా: RR కోలంచి, సౌండ్ డిజైనర్: తేజ ASGK, నిర్మాత: అనల్ప,

రచన-దర్శ కత్వం: కిరణ్మయి ఇంద్రగంటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here