సంతోష్ బాల్రాజ్ కథానాయకుడిగా శ్రీమాతాశ్రీ క్రియేషన్స్ పతాకంపై అశోక్ కడబ దర్శకత్వంలో రూపొందుతున్న సత్యం సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు ఉదయం ( నవంబర్ 25 ) పదిన్నర్రకు అన్నపూర్ణా స్టూడియోలో జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు సుమన్ కథానాయకుడు సంతోష్ .. కథానాయిక రజనీ రాఘవన్ పాల్గొన్న సన్నివేశాన్ని చిత్రీకరించారు.. ఈ కార్యక్రమంలో ముహూర్తపు దృశ్యానికి ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ క్లాప్ నివ్వగా కెమెరా స్విచాన్ దాము బాలాజీ చేశారు.
తదనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మహంతేష్ కె మాట్లాడుతూ నేను కన్నడలో పలు సినిమాలు నిర్మించాను.. ఒక రాజవంశానికి చెందిన కథతో దర్శకుడు నా దగ్గరికి వస్తే ఈ సినిమా తెలుగులో అయితే బాగుంటుంది అనే ఉద్దేశ్వంతో ఈ సినిమాను తెలుగులో తీస్తున్నాము…ఈ సినిమాలో సీనియర్ నటుడు సుమన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కథ మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత అంజి బాబు ఎదురూరి మాట్లాడుతూ ఒక వైవిధ్యమైన కథాంశంతో సినిమా రూపొందిస్తున్నాము… కథ డిమాండ్ బట్టి పాత్రలను ఎంపిక చేసుకున్నాము అన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ ఇది స్ట్రయిట్ తెలుగు సినిమా ఒక రాజవంశానికి చెందిన కథ .. నిర్మాత కథను నమ్ముకుని వచ్చాడు సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లోనూ కరీం నగర్ అడవుల్లోనూ జరుగుతుంది అన్నారు..
దర్శకుడు అశోక్ కడబ మాట్లాడుతూ .. ఈ కథ ను నిర్మాత నమ్మి సినిమా తీస్తున్నందుకు ఆనందంగా ఉంన్నారు .. సినిమాలో నటిస్తున్న హీరో హీరోయిన్ లు సినిమాలో నటిస్తుండటం పట్ల తమ ఆనందాన్ని తెలియజేశారు.
నటీనటులుః సంతోష్ బాల్ రాజ్, రజనీ రాఘవన్, సుమన్, సయ్యాజీ షిండే, పవిత్ర లోకేష్, వినయప్రసాద్, మీనాక్షి కళిత తదితరులు నటిస్తున్నారు.
ఫోటోగ్రఫిః సినీటెక్ సూరి,సంగీతంః రవిబస్రూన్ (కెజియఫ్ ఫేం) మాటలుః కెవిరాజు, ఆర్ట్ః వెంకట్ ఆరె, ఎగ్జిక్యూటివ్ నిర్మాతః ఎదురూరి అంజిబాబు, నిర్మాతః మహంతేష్ కె. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంః అశోక్ కడబ.









