సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన, నిర్మాత DSR నిర్మిస్తున్న నూతన చిత్రం “వచ్చిన వాడు గౌతం”*

శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై అశ్విన్ బాబు, పాలక్ లాల్వాని, విలక్షణ నటుడు నాజర్, కాంతారా ఫెమ్ అచ్యుత్, ఆర్.జె. హేమంత్, సంజ జనక్, మాధవి నటీ, నటులుగా, నిర్మాత DSR నిర్మిస్తున్న తాజా చిత్రం “వచ్చిన వాడు గౌతం” ఈ చిత్రానికి ఎం .ఆర్. కృష్ణను నూతన దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత దామోదర ప్రసాద్ గారు హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన తొలి ముహూర్తము సన్ని వేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత బెల్లంకొండ సురేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకులు ఏ. యస్. రవి కుమార్, వి. సముద్ర, నటుడు రాజా రవీంద్ర లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం
*నటుడు చిత్ర నిర్మాత డి. యస్ రావ్ మాట్లాడుతూ..* కరోనా తర్వాత చాలా మంది నిర్మాతలు సినిమాలు తీసి చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే నేను చాలా రోజులు బ్రేక్ తీసుకొని సినిమా తీస్తున్నాను. దర్శకుడు యం ఆర్. క్రిష్ణ చెప్పిన మెడికో త్రిల్లర్ కథ, హీరో అశ్విన్ బాబుకు, నాకు కూడా నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. సురేష్ బాబు, కంటెంట్ బాగుంటేనే సినిమాలు ఆడతాయి అని చెప్పడంతో ఈ కథను సురేష్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ లో కథ చెప్పించి అందరికీ కథ ఒప్పించి వారి బ్లెస్సింగ్స్ తో ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాను. దర్శకుడు హీరో అశ్విన్ బాబును కొత్త కోణంలో చూపించ బోతున్నారు. పెద్ద పెద్ద సినిమాలు చేసిన టెక్నిషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రానికి “ వచ్చిన వాడు గౌతం” అనే టైటిల్ పెట్టడం జరిగింది. జనవరి నుండి రెగ్యులర్ షూట్ మెదలు పెట్టి వైజాగ్, హైదరాబాద్ లలో రెండు షెడ్యూల్స్ లలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని నటీ, నటులు టెక్నిషియకన్స్ అందరి సహకారంతో మేలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ చిత్రంలో పాలక్ లాల్వాని హీరోయిన్ గా చేస్తుంది. అలాగే నాజర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక నుండి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తియ్యడానికి రెడీ అయ్యాను. త్వరలో ఒక యూత్ హీరోతో కూడా ఒక సినిమా చేస్తున్నాను. మంచి కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని అన్నారు.
నటీ నటులు
అశ్విన్ బాబు, పాలక్ లాల్వాని, విలక్షణ నటుడు నాజర్, కాంతారా ఫెమ్ అచ్యుత్, ఆర్. జె. హేమంత్, సంజ జనక్, మాధవి తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : శ్రీ శైలేంద్ర సినిమాస్
నిర్మాత : డి. ఎస్. ఆర్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ఎం. ఆర్. కృష్ణ
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్ తోట – గిరిధర్
సహ నిర్మాతలు : చందు, వెంకట్,
డి .ఓ. పి : శ్యాం కె. నాయుడు
ఫైట్ మాస్టర్స్ : రామ్ లక్ష్మన్
సంగీతం : హరి గౌర
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ఆర్ట్ డైరెక్టర్ : రఘు కులకర్ణి
మూల కధ : పద్మా నల్లంట్ల
మాటలు : నాదెళ్ళ కృష్ణ చైతన్య – శ్రీ పద్మా నరహరి – రవి వర్మ రొడ్డ
పబ్లిసిటీ డిసైనర్ : దాని ఏలే
పీఆర్వో : సాయి సతీష్










