Home Blog Page 1013

Suman completed 100th movie as a hero with ‘’Veerashastha ayyappa kataksham”

తెలుగులో హీరోగా 99 సినిమాలు చేశాక గ్యాప్ వచ్చింది. ఇంతలో రాఘవేంద్రరావుగారి ‘అన్నమయ్య’లో వేంకటేశ్వరస్వామి పాత్ర చేసే అదృష్టం వచ్చింది. అప్పటినుంచి క్యారక్టర్ రోల్స్ చేసుకుంటూ వస్తున్నాను. తెలుగులో హీరోగా నూరవ చిత్రం ‘వీరశాస్తా అయ్యప్ప కటాక్షం’ కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగులో నా తొలిచిత్రం ‘ఇద్దరు కిలాడీలు’ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు రేలంగి నరసింహారావు సమక్షంలో నా నూరవ చిత్రం ట్రైలర్ విడుదల కావడం సంతోషంగా ఉంది. ఇందుకు కారకులు, ఈ చిత్రానికి కథ, స్క్రేన్ ప్లే, మాటలు, పాటలు సమకూర్చిన నిర్మాత వి.ఎస్.పి.తెన్నేటి గారికి థాంక్స్. నా సూపర్ హిట్ సినిమా ‘అలెగ్జాన్డర్’కి ఆయన మాటలు రాశారు. ఇక నేను పని చేసిన మంచి దర్శకుల జాబితాలో ఈ చిత్ర దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ కూడా ఉంటారు. చాల అద్భుతంగా తెరకెక్కించారు ఈ చిత్రాన్ని.. అన్నారు ఎవర్ గ్రీన్ హీరో సుమన్. 100 క్రోర్స్ అకాడమీ-వరాంగి మూవీస్ సంయుక్తంగా రుద్రాభట్ల వేణుగోపాల్ దర్సకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’.  ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త వి.ఎస్.పి.తెన్నేటి ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు సమకూర్చడంతో పాటు టి.ఎస్. బద్రీష్ రామ్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఏ.జ్యోతి, రమాప్రభ, ఆకెళ్ళ, చలపతి, మాస్టర్ హరీంద్ర, అశోక్ కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్ ఫిలిం ఛాంబర్ లో శాస్త్రబద్ధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదలయ్యింది. హీరో సుమన్ తెలుగులో నటించిన తొలి చిత్ర  దర్శకనిర్మాతలు రేలంగి నరసింహారావు-తమ్మారెడ్డి భరద్వాజ హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. అయ్యప్ప కరుణాకటాక్షాలతోనే ఈ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామని, శంకర్ మహదేవన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వంటి దిగ్గజాలతో పాడించి.. మా మ్యూజిక్ డైరెక్టర్ వి.ఎస్.ఎల్.జయకుమార్ అందించిన ఆడియో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, అయ్యప్ప ఆశీస్సులతో సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్సకనిర్మాతలు వి.ఎస్.పి.తెన్నేటి-టి.ఎస్.బద్రీష్ రామ్, రుద్రాభట్ల వేణుగోపాల్ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: క్రాంతి, కెమెరా: వేణు మురళీధర్-వడ్నాల, సంగీతం: వి.ఎస్.ఎల్.జయకుమార్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-పాటలు: వి.ఎస్.పి.తెన్నేటి, నిర్మాతలు: వి.ఎస్.పి.తెన్నేటి- టి.ఎస్.బద్రీష్ రామ్, దర్శకత్వం: రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)  
 

Naga Chaitanya World from NC19 is Released

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో
తెరకెక్కుతున్న కొత్త సినిమా నుండి మొన్న హీరో చైతు లుక్ విడుదలైంది.
ఆ పోస్టర్ లో సూపర్ కూల్ లుక్ అద్భుతమైన స్పందన లభించింది. సూపర్ ఎనర్జీ
తో ఉన్న యువ సామ్రాట్ ని చూసి అక్కినేని అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడు
నాగచైతన్య ప్రపంచాన్ని పరిచయం చేసే ఓ వీడియో విడుదల చేసాడు డైరెక్టర్
శేఖర్ కమ్ముల . ఈ వీడియో లో చైతు చాలా సహాజంగా కనిపించాడు. ఆడుతూ పాడుతూ
తన పనులు తాను చేసుకుంటున్న చైతు కొత్త గా ఉన్నాడు. ఈ వీడియో రెస్పాన్స్
తో చిత్ర యూనిట్, చైతన్య అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఫస్ట్ షెడ్యూల్
కంప్లీట్ చేసుకున్న ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ  సెకండ్ షెడ్యూల్ త్వరలో
మొదలవుతుంది.2020 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఏమిగోస్  క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి
బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను
నిర్మిస్తున్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్
కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సహా నిర్మాత : విజయ్ భాస్కర్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు
రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల

OMG Daddy’ from ‘Ala Vaikunthapurramlo’ out now

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, “రాములో రాముల” పాటలు చిత్రం పై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే.
ఇప్పుడు సంగీత దర్శకుడు థమన్ స్వరపరచిన చిత్రం లోని మరోగీతం ‘ఓ డాడీ’ ఈరోజు విడుదలైంది. సాహిత్య విలువలతో కూడిన,ఎన్నో విజయవంతమైన గీతాలను రచించిన గీత రచయిత కృష్ణ చైతన్య ఈ పాట రాసారు. ఈ పాటలో వచ్చే తెలుగు ర్యాప్ కూడా ఆయనే రాయడం విశేషం. తెలుగు ర్యాప్ ని బిగ్ బాస్ ఫేమ్ రోల్ రైడా పాడగా, ఇంగ్లీష్ ర్యాప్ ని ‘రాహుల్ నంబియార్’ పాడారు. ఫిమేల్ ర్యాప్ ని లేడీ కాష్ పాడింది. గాయకుడు ‘రాహుల్ సిప్లిగంజ్’ ఈ పాటను తన స్టయిల్ లో పాడి ఉర్రూతలూగించారు.. బ్లాజీ ఈ పాటకు గాత్ర సాయం చేశారు.

‘ఓ డాడీ’ గీతం విడుదలైన కొద్ది సమయానికే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో మరో ఫేవరేట్ సాంగ్ గా చార్ట్ బస్టర్స్ లో టాప్ లో నిలుస్తోంది.మరో అద్భుతమైన పాటను అందించి, మరొక సూపర్ హిట్ ఆల్బమ్ ను తన ఖాతాలో థమన్ వేసుకున్నారన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,
పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, పి.ఆర్.ఓ.: లక్ష్మి వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

superstar mahesh babu’s ”Sari leru nikevvaru” movie teaser going viral on ‘Socialmedia’

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం  ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. నవంబర్‌ 23 యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి పుట్టినరోజు. ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ నవంబర్‌ 22న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ను విడుదల చేశారు.
మిలటరీ బ్యాక్‌డ్రాప్‌తో మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌తో ఈ టీజర్‌ ప్రారంభమవుతుంది. ‘మీరెవరో మాకు తెలీదు.. మీకు, మాకు ఏ రక్తసంబంధం లేదు. కానీ, మీకోసం పిల్లల కోసం పగలు, రాత్రి, ఎండా, వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత’ అంటూ సైనికుల కర్తవ్యం గురించి చెప్పే మాటలు ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి.
ఆ తర్వాత కొంతమంది రౌడీలను ఉద్దేశించి ‘మీరంతా నేను కాపాడుకునే ప్రాణాల్రా. మిమ్మల్నెలా చంపుకుంటాన్రా. మీకోసం ప్రాణాలిస్తున్నాంరా అక్కడ. మీరేమో కత్తులు, గొడ్డళ్లేసుకొని ఆడాళ్ళ మీద.. బాధ్యత ఉండక్కర్లా.. అంటూ చెప్పే డైలాగ్‌ కొత్తగా అనిపిస్తుంది.
ఆ తర్వాత ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌లో ‘భయపడే వాడే బేరానికొస్తాడు.. మనదగ్గర బేరాల్లేవమ్మా..’ అంటూ లౌడ్‌గా చెప్పే డైలాగ్‌ మహేష్‌ క్యారెక్టర్‌లోని ఎమోషన్‌ని తెలియజేస్తుంది. లేడీ అమితాబ్‌ విజయశాంతి హీరో క్యారెక్టర్‌ గురించి చెప్తూ ‘గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్‌’ అంటూ హీరో ఔనత్యాన్ని తెలియజేస్తుంది. టీజర్‌ ఎండింగ్‌లో ఇరిటేషన్‌లో ఉన్న ప్రకాష్‌రాజ్‌ ‘ప్రతి స్రంకాంతికి అల్లుళ్లొస్తారు… ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు’ అంటూ చెప్పే డైలాగ్‌ ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. మొత్తానికి ఈ టీజర్‌లో అన్నిరకాల ఎలిమెంట్స్‌ ఉండేలా ఎంతో కేర్‌ తీసుకున్నారనేది అర్థమవుతుంది. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయి. ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్‌ కేరళలోని అంగామలై ఫారెస్ట్‌లో జరుగుతోంది. నవంబర్‌ 22 వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది. నవంబర్‌ 25 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్‌ కంటిన్యూ అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

ss rajamouli congratulated y.srinivas reddy

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. డిసెంబ‌ర్ 6న విడుద‌ల సినిమాను విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ చాలా బావుందంటూ ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ద‌ర్శ‌క నిర్మాత శ్రీనివాస‌రెడ్డి స‌హా ఎంటైర్ యూనిట్‌ను అభినందించారు. ఇప్పుడు దర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఈ చిత్రంతో ద‌ర్శ‌క నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్న శ్రీనివాస‌రెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు.

“నేను కెరీర్‌ను స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుండి శ్రీనివాస‌రెడ్డి నాకు తెలుసు. త‌ను మంచి క‌మెడియ‌న్‌. తొలిసారి `భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు` సినిమాతో ద‌ర్శ‌క నిర్మాత‌గా ప‌రిచయం అవుతున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీనివాస‌రెడ్డి అభినంద‌న‌లు తెలుపుతున్నాను“ అంటూ ట్వీట్ చేశారు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.

ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల మెగాప్రిన్స్‌ వ‌రుణ్‌తేజ్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డిసెంబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను అందించారు.

”Annapurnamma gari mavadu” audio launch

అక్కినేని అన్నపూర్ణమ్మగా సీనియర్‌ నటి అన్నపూర్ణ, ఆమె మనవడిగా మాస్టర్‌ రవితేజ నటించిన తాజా చిత్రం అన్నపూర్ణమ్మ గారి మనవడు. నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎమ్మెన్నార్‌ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌ థియేటర్‌లో ఘనంగా జరిగింది.ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ బిగ్‌ సీడితో పాటు ఆడియో సీడీలను ఆవిష్కరించగా…తొలి సీడీని మరో అతిథిగా పాల్గొన్న కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌ (దాము) అందుకున్నారు. చిత్రం టీజర్‌ను ఆదిత్యా మ్యూజిక్‌ ప్రతినిధి మాధవ్‌ విడుదల చేశారు.
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, దర్శకుడు శివనాగు ఆర్టిస్టు కావాలనుకుని చిత్ర పరిశ్రమలోనికి వచ్చారు. ఆ తర్వాత అభిరుచితో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం టైటిల్‌, సన్నివేశాలు, పాటలు చూస్తుంటే…పల్లెటూరి వాతావరణాన్ని, కుటుంబ ఆప్యాయతలను, అనుబంధాలను చాటిచెప్పేవిధంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రబృంద ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌ మాట్లాడుతూ, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు కుటుంబ బంధాలను…వాటికున్న విలువలను, ప్రాధాన్యాన్ని చెప్పే ఇలాంటి చిత్రాలు విజయం సాధించాలని ఆకాంక్షించారు.
 అతిథి వి.సాగర్‌ మాట్లాడుతూ– పిచ్చి పిచ్చి టైటిల్స్‌ పెడుతున్న ఈ రోజుల్లో అందరూ చూసే చక్కటి కథతో, మంచి టైటిల్‌తో ఈ చిత్రాన్ని తీయడం అభినందనీయమని అన్నారు. అభిరుచి కలిగిన దర్శకుడికి అభిరుచి కలిగిన నిర్మాత తోడు కావడం వల్లే ఇలాంటి చక్కటి చిత్రాలు వస్తాయని అన్నారు.
టైటిల్‌ పాత్రధారి, సీనియర్‌ నటి అన్నపూర్ణ మాట్లాడుతూ—దర్శకుడు ఈ చిత్రకథ చెప్పగానే వెంటనే నటించాలనిపించింది. ఇందులో నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కథకు ప్రాధాన్యమిచ్చి తీసిన చిత్రమిది. నాకు మనవడుగా నటించిన మాస్టర్‌ రవితేజ ఎంతో ఈజ్‌తో నటించాడు. అతనికి చాలా మంచి భవిష్యత్‌ ఉంటుంది అని అన్నారు.
మనవడు పాత్రధారి మాస్టర్‌ రవితేజ మాట్లాడుతూ, అన్ని రసాలను మేళవింపుతో తెరకెక్కిన చిత్రమిది. నటించడానికి ఎంతో అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించడం ఆనందంగా ఉంది. దర్శకుడి వల్లే పాత్రను రక్తికట్టించే అవకాశం నాకు కలిగింది అని అన్నారు.

దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు మాట్లాడుతూ—లోగడ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ పలు చిత్రాలను రూపొందించాను. పల్లెటూరి ప్రేమలను…వాతావరణాన్ని ప్రతింబించే చిత్రాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే అలాంటి కథను ఎంచుకుని ఈ చిత్రాన్ని మలిచాం. నటీనటులంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మాస్టర్‌ రవితేజ మనవడి పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచాడు. బడ్జెట్‌ ఎక్కువైనా నిర్మాత ఎమ్మెన్నార్‌ చౌదరి ఎక్కడా రాజీపడకుండా సినిమా బాగా రావాలని ఎంతో సహకరించారు. సీనియర్‌ నటి జమునగారు అక్కినేని అనసూయమ్మ పాత్రలో ఆకట్టుకుంటారు అని అన్నారు.

నిర్మాత ఎమ్మెన్నార్‌ చౌదరి మాట్లాడుతూ–డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతోనే దీనిని తీశాం. అందరి సహకారంతో మేము అనుకున్నట్లుగా చిత్రం చాలాబాగా వచ్చింది అని అన్నారు. ఈ వేడుకలో నటుడు బెనర్జీ, గాయని పసల బేబి, సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్‌, నటుడు గోవిందరాజుల చక్రధర్‌ తదితరులు పాల్గొన్నారు.

”Degree college” trailer launch

అవార్డు చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ”డిగ్రీ కాలేజ్”, తన పంధాకు బిన్నంగా రొమాన్స్ అంశాలను మేళవించి ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. వరుణ్, దివ్య రావు హీరోహీరోయిన్లుగా శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాణమైన ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను గురువారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. అతిధిగా పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు వినాయకరావు ట్రైలర్ ని విడుదల చేసి…చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందచేశారు.

అనంతరం దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ:– ఇద్దరు డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మధ్య అంకురించిన యదార్ధ ప్రేమ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసాం. ఆ అబ్బాయి, అమ్మాయి క్లాస్ రూంలో, బయట ఎలా ప్రవర్తించారో ఆ అంశాలనే ఇందులో చూపించాం. ఆ మధ్య విడుదల చేసిన ఈ చిత్రం మొదటి ట్రైలర్ కు విశేషమైన స్పందన లభించింది. రికార్డు స్థాయిలో లైక్స్ వచ్చాయి. అదే సమయంలో ట్రైలర్ ని చూసిన కొంతమంది ఈ చిత్రానికి సెన్సార్ ఎలా వస్తుందో చూస్తాం అన్నట్లుగా మాట్లాడారు. కానీ సెన్సార్ నిబంధనల ప్రకారంగా ఇస్తారు. చాలా రోజులు సెన్సార్ లోనే ఈ చిత్రం ఉండిపోయింది. ప్రాంతీయ సెన్సార్ బోర్డులో సెన్సార్ పరంగా సమస్య ఎదురు కావడంతో రీవైసింగ్ కమిటీకి ఈ చిత్రాన్ని పంపడం జరిగింది. కేవలం రెండు దృశ్యాలను మాత్రమే కట్ చేసారు. ఇలాంటి కథను యధాతదంగా చూపించడానికి దైర్యం కావాలి అంటూ అందరూ ప్రశంసించారు. గతంలో నేను తీసిన సినిమాలకు అవార్డులు వచ్చాయి. కానీ ఈ చిత్రానికి రివార్డులు వస్తాయి. డిసెంబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేస్తాము అన్నారు.


హీరో వరుణ్ మాట్లాడుతూ, ఇలాంటి చిత్రాలు యువతను చెడిపేస్తున్నాయి అని కొందరు అంటున్నారు. కానీ రియల్ స్టోరీ ప్రేరణతోనే ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. రొమాన్స్ అంశాలను సబ్జెక్టు లో భాగంగానే పెట్టడం జరిగింది అని అన్నారు. కో ప్రొడ్యూసర్ ఆలేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తప్పకుండా ఆదరించే సినిమా అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మరో కో ప్రొడ్యూసర్ బత్తుల కొండయ్య, నటుడు రవి రెడ్డి, మల్లేష్, బడ్దల హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

]

Rupam S20+ Movie release date

సాయి లోకేష్ ప్రొడక్షన్ పతాకంపై  సాయి తులసి సమర్పణలో చక్రవర్తి , బంగారాజు , అక్షర ,సంతోషిణి హీరో హీరోయిన్లుగా వెల్లంకి దుర్గాప్రసాద్ దర్శకత్వంలో సి.రామాంజనేయ నిర్మిస్తున్న అందమైన అమ్మాయిల ప్రేమ కథ చిత్రం “రూపం యస్ 20 ప్లస్” ఈ  నవంబర్ 28 న ప్రేక్షకులముందుకు వస్తుంది.

దర్శకుడు వెల్లంకి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… అందమైన అమ్మాయిలను చూస్తే ప్రతి మగాడికి ప్రేమ కలుగుతుంది, ఎలాగైనా ట్రాప్ లో పడేయాలని చూస్తారు, ఒప్పుకోకపోతే బలవంతంగానైనా కోరిక తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు, ఇలాగే మా చిత్రంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయిని ఎలా పాడు చేసారు, ఆమె వాళ్లనుండి ఏ విధంగా తప్పించుకుంది, మంచి మనిషికి దగ్గరై అతని ప్రేమను ఎలా పొందింది అన్నది ఒక జంట కథగా , ఒక పోలీస్ ఆఫిసర్ అందమైన అమ్మాయి ప్రేమలోపడి పెళ్లిచేసుకొన్నాడు, మాఫియా వలలో చిక్కుకొన్న తన భార్యను ఎలా కాపాడుకొన్నాడన్నది రెండో జంట కథ, ఈ రెండు జంటల కథను అనేక మలుపులు తిప్పుతూ అద్భుతమైన స్కీన్ ప్లై తో రూపొందిన్చాన్నారు .                                                                                                                                                                                నిర్మాత  సి.రామాంజనేయ  మాట్లాడుతూ… ఈ చిత్రంలో నాలుగు ఫైట్లు ,  నాలుగు పాటలు ఉన్నాయని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్ది నవంబర్ 28 న విడుదల చేస్తున్నామన్నారు.

ఇంకా ఈ చిత్రంలో ఉమామహేశ్వరి , రజనీకాంత్ , అజయ్ , రజని , సరోజని నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : సాగర్ , ఆనంద్ , సంగీతం : మెలోడీ శ్రీనివాస్ , ఆర్ ఆర్ అర్మాన్ , పాటలు : వెల్లంకి విజయలక్ష్మి , ఫైట్స్ : లంక సాంభశివరావు ,ఎడిటింగ్ : వెంకటేశ్వర్లు , కథ , మాటలు , నిర్మాత : సి.రామాంజనేయ , స్కీన్ ప్లై , దర్శకత్వం : వెల్లంకి దుర్గాప్రసాద్

‘M3″movie firstlook,motion poster

టాలీబీట్స్‌ మీడియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య హీరోహీరోయిన్లుగా రామకృష్ణ తోట స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఎం3’. (మ్యాన్‌ మ్యాడ్‌ మనీ అనేది క్యాప్షన్‌). ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని చిత్ర యూనిట్‌ ఈరోజు (నవంబర్‌ 22న) విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు రామకృష్ణ తోట మాట్లాడుతూ – మా చిత్రం మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయడం చాలా హ్యాపీగా ఉంది.   సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రం రూపొందింది.  తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌ బేస్డ్‌ మూవీస్‌ని ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ‘ఎం3’ చిత్రం కూడా ఆ కోవలోనే ఉంటుంది. సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య చాలా బాగా నటించారు. అలాగే మిగితా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ సినిమా బాగా రావడానికి ఎంతగానో సహకరించారు.  అలాగే ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించిన సునీల్‌ కశ్యప్‌ మా సినిమాకి సంగీతం అందించడం సంతోషంగా ఉంది. కల్యాణ్‌ సమి బ్యూటిఫుల్‌ విజువల్స్‌, వెంకట ప్రభు ఎడిటింగ్‌, రాజ్‌కుమార్‌ ఆర్ట్‌ వర్క్‌, శంకర్‌ స్టంట్స్‌ సినిమాకి ప్లస్‌ అవుతాయి. ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్‌ అంశాలు ఇందులో ఉన్నాయి” అన్నారు.
సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య, రాజశేఖర్‌, యోగి, జయభారత్‌ రెడ్డి, దినేష్‌, రామకృష్ణ తోట, జయచంద్ర, లక్ష్మణ్‌, పగడాల ప్రసాద్‌, కెఎస్‌ మూర్తి, త్రిమూర్తి, సునీత మనోహర్‌, చందన, మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: కల్యాణ్‌ సమి, ఎడిటింగ్‌: డి. వెంకట ప్రభు, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, ఆర్ట్‌: రాజ్‌కుమార్‌, స్టంట్స్‌: శంకర్‌, కొరియోగ్రఫీ: శామ్యూల్‌, జోసెఫ్‌ ప్రకాష్‌, పి.ఆర్.ఓ : సాయి సతీష్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరత్ కొండూరు, రచన,నిర్మాత, దర్శకత్వం: రామకృష్ణ తోట.

Dhanush new movie “Thoota”

హీరో ధనుష్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తొలిసారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎనై నోకి పాయుమ్ తోట. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో అనువదిస్తున్నారు. మేఘ ఆకాష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఇందులో అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కు దర్భుక శివ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస, ఎస్ఆర్ కాథిర్, జామన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమా నవంబర్ 29న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. విజయభేరి వారి బ్యానర్ పై జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి ఈ చిత్రం తెలుగు హక్కులను కొనుగోలు చేశారు.

నటీనటులు: ధనుష్, మేఘా ఆకాశ్

సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్
నిర్మాతలు: జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి
సంగీతం: ధర్భుక శివ
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, జామన్ టి జాన్, ఎస్ఆర్ కాథిర్
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
లిరిక్స్: అనంత శ్రీరామ్, చైతన్య ప్రసాద్
పబ్లిసిటీ డిజైన్స్: విక్రమ్ డిజైన్స్
పిఆర్ఓ: వంశీ శేఖర్