Home Blog Page 20

High-voltage action drama “Khaigal” first look released – Jai Siddharth in a powerful avatar

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పాన్-గ్లోబల్ చిత్రం “ఖైగల్” ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హీరో జై సిద్ధార్థ్ ‘దేవ’ పాత్రలో కనిపిస్తూ, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాకి సంకేతాలిస్తోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అగ్ని జ్వాలలు, గందరగోళం మధ్య రక్తసిక్తంగా నిలిచిన యోధుడిగా జై సిద్ధార్థ్ కనిపించడం విశేషం. తిరుగుబాటు, ఆగ్రహం, శక్తి—all కలగలిపిన ఈ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రంలో సతీ పాత్రలో సుష్మిత సింగ్, నందిని పాత్రలో వాంశీ ఉదయ్ నటిస్తున్నారు. యశ్‌విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా రమేష్, అక్షర జి.ఆర్, సంతోష్ అబ్రహం నిర్మిస్తున్నారు. జి.ఆర్ ప్రొడక్షన్స్ మరియు ఖైగల్ వారియర్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.

దర్శకుడు యశ్‌విన్ మాట్లాడుతూ, జై సిద్ధార్థ్‌కు ఉన్న ఎత్తు, స్క్రీన్ ప్రెజెన్స్ మరియు బాస్ వాయిస్ ‘దేవ’ పాత్రకు ప్రత్యేకమైన డెప్త్‌ను తీసుకువస్తాయని తెలిపారు. ఆయన నటన ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

సాంకేతికంగా కూడా ఈ చిత్రం బలంగా ఉంది. సినిమాటోగ్రఫీని దేవ్ దీప్ కుండు అందిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్‌ను అరుణాచల నాని, ఆర్ట్ డైరెక్షన్‌ను రవి కొండి నిర్వహిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లను యోగానంద డిసి రూపొందిస్తున్నారు.

సంగీతాన్ని ప్రియేష్ మోతుకూరి స్వరపరచగా, ఎడిటింగ్ బాధ్యతలను ప్రీతమ్ గాయత్రి చేపట్టారు. కాస్ట్యూమ్స్‌ను ఆయేషా మరియం డిజైన్ చేస్తున్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివరాజా బిఎన్ పర్యవేక్షణలో, సాగర్ షణ్భోగర్ కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ మరియు పబ్లిసిటీ డిజైన్‌ను రాకేష్ జల్లూరి అందించగా, డ్యాన్స్ కొరియోగ్రఫీని గీత నిర్వహిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానున్న “ఖైగల్” చిత్రం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీతో పాటు ఇంగ్లీష్, అస్సామీ, మరాఠీ, సింహళీ, స్పానిష్, జర్మన్, చైనీస్, జపనీస్ భాషల్లో మొత్తం 13 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Action King Arjun Sarja’s ‘Sita Payanam’ Movie is streaming on ‘Sun NXT’ on Occasion of Ugadi

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వస్తున్న సినిమా ‘సీతా పయనం’ ఉగాది పండుగ సందర్భానికి తగిన కుటుంబ కథగా రూపొందింది. ప్రేమ, బంధాలు, జీవితంలో వచ్చే అనుకోని మార్పులు కలగలిపిన ఈ కథ ప్రతి ఒక్కరికీ దగ్గరగా అనిపించేలా ఉంటుంది. తండ్రీకూతుళ్లైన అర్జున్ సర్జా మరియు ఐశ్వర్య అర్జున్ కలిసి పనిచేసిన ఈ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగ క్షణాలు ఈ సినిమాకు హృదయాన్ని అందిస్తాయి.ముఖ్యంగా అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం కథకు మరింత ప్రాణం పోసింది.

కథలో సీత అనే అమ్మాయి జీవితం ప్రధానంగా ఉంటుంది. తల్లి లేకుండా పెరిగిన ఆమెకు తండ్రి రాజేంద్ర ప్రసాద్‌నే ప్రపంచం. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో ఆప్యాయంగా ఉంటుంది. అయితే పెళ్లి విషయాన్ని తప్పించుకుంటూ ఉండే సీత, వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు చేసే ప్రయాణంలో అనుకోని పరిణామాలను ఎదుర్కొంటుంది. గిరి, బసవన్నల పరిచయం ఆమె జీవితాన్ని ఎలా మార్చింది అనేదే ఈ కథ సారాంశం.

ఈ సినిమా గురించి ఐశ్వర్య అర్జున్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ తనకు చాలా ప్రత్యేకమని, ముఖ్యంగా తన తండ్రితో కలిసి పని చేయడం మరింత భావోద్వేగంగా అనిపించిందని చెప్పారు. ఈ ఉగాదికి ప్రేక్షకులు ఈ ప్రయాణాన్ని అనుభవించబోతున్నందుకు తాను ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు.

అర్జున్ సర్జా కూడా ఈ చిత్రాన్ని తన జీవితంలో ప్రత్యేకమైనదిగా పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి చూసేందుకు ఇది సరైన సినిమా అని అన్నారు. ప్రకాష్ రాజ్ ఈ కథలోని సరళత, నిజాయితీ తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. సత్యరాజ్ మాత్రం తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న బంధం తనకు ఎంతో దగ్గరగా అనిపించిందని తెలిపారు.

మొత్తంగా అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్, ధ్రువ సర్జా, నిరంజన్, ప్రకాష్ రాజ్ మరియు సత్యరాజ్‌లతో కూడిన  ‘సీతా పయనం’ ఒక మృదువైన భావోద్వేగ ప్రయాణం—నవ్వులు, కన్నీళ్లు, గుర్తులు అన్నీ కలిపిన అనుభూతిని ప్రేక్షకులకు అందించే సినిమా. ఈ ఉగాది, కుటుంబంతో కలిసి చూడదగిన మంచి చిత్రంగా నిలుస్తుంది.

Director V.V. Vinayak released the song ‘Makkulu Makkulu College’ from ‘Pithapuramlo’ Movie

ప్రముఖ దర్శకుడు మహేష్ చంద్ర దర్శకత్వంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్, పథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉప శీర్షిక ‘అలా మొదలైంది’. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్‌పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.సి. క్రిష్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలోని ‘మక్కుళు మక్కుళు కాలేజూ యవ్వన మర్కట గ్యారేజూ’ పాటను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆవిష్కరించారు. ఈ పాటను శ్రీరామ్ తపస్వి రాశారు.

ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ ‘‘నేను కో డైరెక్టర్‌గా చంద్ర మహేష్ గారి దగ్గర ‘చెప్పాలని ఉంది’ చిత్రానికి పనిచేశాను. ఆ తర్వాత ‘ఆది’ సినిమాతో దర్శకుణ్ణి అయ్యాను. చంద్ర మహేష్‌గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. సుప్రసిద్ధ నిర్మాత డి. రామానాయుడుగారికి ఇష్టమైన దర్శకుల్లో చంద్ర మహేష్ ఒకరు. ఆయన యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా మూడువిభిన్న ప్రేమ కథలతో ‘పిఠాపురంలో’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా పెద్ద హిట్టు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిర్మాతలకు మంచి లాభాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని చెప్పారు.

దర్శకుడు చంద్ర మహేష్ మాట్లాడుతూ ‘‘ఈ వారంలో ఈ సినిమా ట్రయిలర్ విడుదల చేస్తున్నాం. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం. నా కెరీర్‌లోనే ఇదొక మంచి సినిమాగా నిలిచిపోతుంది’’ అని తెలిపారు.

డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K A పాల్ రాము, జబర్దస్త్ శేషు ఇందులో ప్రధాన తారాగణం. 

ఈ చిత్రానికి కథ: ఆకుల సురేష్ పటేల్,  స్టోరీ డెవలప్మెంట్ & డైలాగ్స్ : శ్రీరామ్ ఏదోటి, ఎడిటర్: B. సత్యనారాయణ, మ్యూజిక్ : G.C క్రిష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అంజి సండ్రాల, నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, FM మురళీ (గోదారి కిట్టయ్య), స్క్రీన్ ప్లే- డైరెక్షన్: మహేష్ చంద్ర .

‘Spider-Man’ Swings into a New Era with ‘Spider-Man: Brand New Day’ – Trailer Out Now!

After the first-of-its-kind global fan-driven trailer tease, Tom Holland spectacularly unveiled the full trailer from atop the iconic Empire State Building, surrounded by passionate Spider-Man fans as the sun rose over New York City, marking a truly unforgettable moment for audiences worldwide.

After the record-breaking global success of Spider-Man: No Way Home, Spider-Man: Brand New Day marks an entirely new chapter for Peter Parker and Spider-Man. Four years have passed since the events of No Way Home, and Peter is now an adult living entirely alone, having voluntarily erased himself from the lives and memories of those he loves. Crime-fighting in a New York that no longer knows his name, he’s devoted himself entirely to protecting his city — a full-time Spider-Man — but as the demands on him intensify, the pressure sparks a surprising physical evolution that threatens his existence, even as a strange new pattern of crimes gives rise to one of the most powerful threats he has ever faced.

Directed by Destin Daniel Cretton, Tom Holland returns as Spider-Man alongside Zendaya, Jacob Batalon, Sadie Sink, Jon Bernthal, Mark Ruffalo, Michael Mando and Tramell Tillman in pivotal roles.

Produced by Sony Pictures Entertainment India, the film will release in theatres on 31st July in English, Hindi, Tamil, Telugu, Kannada, and Malayalam across all premium formats.

‘Ustaad Bhagat Singh’ Movie Pre Release Pressmeet held grandly

‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్తగా కాగా, ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, మాస్ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి ఉగాది కానుగా మార్చి 19వ తేదీన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం చిత్ర బృందం, ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ సందర్భంగా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “ముందుగా మీడియా మిత్రులకు కృతఙ్ఞతలు. చాలా రోజుల తరువాత మిమ్మల్ని ఇలా కలవడం సంతోషంగా ఉంది. ఈ ఉగాది ‘ఉస్తాద్ ఉగాది’ కాబోతుంది. ఒక బిగ్ స్టార్ నుంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ వచ్చి చాలా కాలమైందని నా అభిప్రాయం. అభిమానులు మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసేలా స్టార్ హీరో నుంచి అన్ని హంగులతో వచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో లేదని నా ఫీలింగ్. పాటలు, డ్యాన్స్, డైలాగులు, ప్రేమ, హాస్యం, విలన్ తో పవర్ ఫుల్ సీన్స్.. ఇలా అన్ని అంశాలు ఉంటాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందని నేను చెప్పలేని కానీ, ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇలాంటి సినిమా వచ్చి కాలమైంది, ఇంత ఎంటర్‌టైనింగ్ సినిమా వచ్చి చాలా కాలమైందని అనుకుంటారు. హెయిర్ స్టైల్ నుంచి డ్యాన్స్, డైలాగ్ లు, హాస్యం వరకు ఇలా పవన్ కళ్యాణ్ గారి నుంచి కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉండి.. పూర్తిస్థాయి పవన్ కళ్యాణ్ గారి సినిమా చూశామనే సంతృప్తిని ఇస్తుంది ఉస్తాద్. అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేసి, మంచి అవుట్ పుట్ ఇచ్చాము. పక్కా ప్లానింగ్ తో సమయాన్ని, డబ్బుని వృధా చేయకుండా ఈ సినిమా పూర్తి చేయగలిగాము. అలా చేయగలగడానికి మా ప్రధాన బలం పవన్ కళ్యాణ్ గారు. ప్రజా పాలన, పరిపాలనా పరమైన అంశాలకు ఇబ్బంది కలగకుండా మాకు సమయం ఇచ్చేవాళ్ళు. ఫలానా సమయానికి రాగలనని, ఇంత సమయం కేటాయించగలనని ముందుగానే సమాచారం ఇచ్చేవారు. మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలను కాపాడుకోవడం నాలాంటి ప్రతి దర్శకుడి బాధ్యత. వీళ్ళు మరిన్ని సినిమాలు తీస్తూ, పది కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండాలి. సినిమా ఆలస్యమైనా ఒక్కసారి కూడా అసహనం ప్రదర్శించలేదు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. నేను అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారు. మా నిర్మాతల మద్దతు వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. అలాగే చివరి నిమిషంలో హీరోలా వచ్చి, నేపథ్య సంగీతం బాధ్యత తీసుకున్న తమన్ కి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఇలాంటి అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాకి కేవలం 12-13 రోజుల్లో అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. ఇలాంటి పూర్తిస్థాయి ఎంటర్‌టైనింగ్ సినిమా చూసి కాలమైందని చూసిన ప్రతి ఒక్కరూ కనీసం పది మందికి చెబుతారు. అభిమానులు మళ్ళీ మళ్ళీ చూస్తారు.” అన్నారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “చాలా చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనేది మా కల. అది ఉస్తాద్ భగత్ సింగ్ తో నెరవేరింది. ఐదారేళ్ళ క్రితం సినిమా చేయాలనుకున్నాము. కోవిడ్, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం వంటి కారణాల వల్ల.. గతేడాది జూన్ లో సినిమా ప్రారంభించాము. నిర్మాతలుగా మాకు ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఒక పిక్నిక్ లాగా సినిమా అయిపోయింది. దానికి ముఖ్య కారణం మా దర్శకుడు హరీష్ శంకర్ గారు. పవన్ కళ్యాణ్ ప్రజా సేవలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేసి షూటింగ్ పూర్తి చేశారు హరీష్ గారు. ప్రతి మూవీ ఎలా ఉంటే.. సంవత్సరానికి పది మూవీలు హ్యాపీ తీయొచ్చు. సరిగా నిద్ర కూడా పోకుండా పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ కార్యక్రమాలు కూడా చూసుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పటికీ నాలుగైదు సార్లు చూశాను. ఎన్నిసార్లు చూసినా ఒకటే అభిప్రాయం. ఇది పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్. వినోదం, భావోద్వేగాలతో పాటు అన్ని అంశాలు నిండి.. ఆద్యంతం సినిమా ఆకట్టుకునేలా ఉంటుంది. ఇదొక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. రేపు ఉదయం 5 గంటల నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు ప్రారంభమవుతాయి. అందరూ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తానని ఆశిస్తున్నాము.” అన్నారు.

కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. “ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు నూతన సంవత్సరాది కానుకగా మా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలవుతుండటం మాకు చాలా చాలా ప్రత్యేకం. సినిమా పట్ల మేము చాలా నమ్మకంగా ఉన్నాము. ఒక మంచి తెలుగు సినిమా ఉగాదికి వస్తుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ప్రేక్షకుల మా సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాము. మీడియా మద్దతు మరువలేనిది. రాశి ఖన్నా స్వీట్ హార్ట్. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు లేనప్పటికీ, ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఒకరికొకరం దగ్గరయ్యాం. ఈ సినిమా మాకు చాలా ముఖ్యమైనది. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

కథానాయిక రాశి ఖన్నా మాట్లాడుతూ.. “రేపు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకుల ముందుకు వస్తుండటం చాలా ఉత్సాహంగా ఉంది. 2026 లో నా మొదటి సినిమా, ఉగాదికి వస్తుంది, పైగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇది నాకు ట్రిపుల్ సెలబ్రేషన్. అందరం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము. ముఖ్యంగా హరీష్ శంకర్ గారు నిద్ర కూడా మానుకొని సినిమా కోసం కష్టపడ్డారు. ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు సినిమా కోసం ఎంతో చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా, పార్థిబన్ తదితరులు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నేపథ్య సంగీతం: ఎస్. తమన్
కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్
కూర్పు: కార్తిక శ్రీనివాస్
కళ: ఆనంద్ సాయి
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: ఆర్. చంద్రశేఖర్, దినేష్ నరసింహన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై
ఫైట్స్: రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

‘Rendu Jadala Jamuna’ Folk Song Released held grandly

The folk song “Rendu Jadala Jamuna”, which reflects the rich rural culture of Telangana, has recently been released to the audience. The song was officially launched at a special event held on Thursday at Rama Naidu Studios in Hyderabad, under the coordination of Chitralahari Events.

This Telugu folk-style video song has been receiving a positive response from viewers. The song has been released under the renowned music label Pratyagra Music Paradise. The rural-style lyrics and traditional music give the song a unique charm.

The music for this folk song has been composed by Mahimadan, while the lyrics were written by Nagaraju (famed for the song “Anita O Anita”). The song is sung by Boddu Dileep and Prabha, whose vocals bring life to the track. The video features Madhuri Rathod and Rajesh Jaguar in the lead roles.

The song is directed by Vishwa Parish and G.V. Praveen Kumar. J.P. Vijayan served as the Creative Producer. Cinematography is handled by Rajesh Nagalingam, editing by Lokeshwar, and choreography by Vishal Kannan. According to the makers, the song was produced with a budget of approximately ₹10 lakhs.

This folk song, which showcases the rural lifestyle of Telangana, is currently receiving good appreciation on social media. In particular, the Telangana dialect, rural backdrop, and traditional style have become major highlights of the song.

Pratyagra Music Channel also announced that it will donate 10% of its revenue to charities and is looking forward to bringing more Telugu content to audiences in the future.

Hero Kiran Abbavaram’s KA Productions and Sumaira Studios Thimmarajupalli TV; Ooru Song” out now

Encouraging new talent, actor Kiran Abbavaram is producing the film “Thimmarajupalli TV” under his banner KA Productions in association with Sumaira Studios. Teja Velpucharla is serving as the co-producer. With this film, Sai Tej and Veda Jalandharr are being introduced as the lead actors. V. Muniraju is also making his debut as a director with “Thimmarajupalli TV.”

Set against a village backdrop, the film is being made as a period drama and is gearing up for a grand theatrical release soon. Today, the makers released the “Ooru Song” from the movie “Thimmarajupalli TV.” The song has been beautifully composed by Vamsikanth Rekhana, with lyrics written by Sanare and vocals by Mamatha Ramesh. The song vividly captures the festive atmosphere of a village preparing for the Shivaratri fair.

The song portrays the charm of rural life – from the sound of cuckoos on tree branches and the lush greenery of the village at dawn to the colorful rangolis decorating the houses and the fragrant breeze carrying the scent of flowers. The lyrics also reflect the excitement among people of all ages as the village gets ready to celebrate the Shivaratri festival and the lively fair that accompanies it.

Cast
Sai Tej, Veda Jalandharr, Pradeep Kotte , Swathi Karimireddy , Amma Ramesh, Satyanarayana, Lathish and others

Technical Team
Costume Designer – Vishalya
Art Director – Sudheer Macharla
Business Head and Marketing – Chavan
Creative Producer – Ritikesh Gorak
Executive Producer – KL Madan
Director of Photography – Akshay Ram Podishetti
Music – Vamsikanth Rekhana
CEO – Rahasya Kiran
PRO – GSK Media (Suresh – Sreenivas)
Co-Producer – Teja Velpucharla
Producer – Kiran Abbavaram
Story, Editing and Direction – V. Muniraju

Chief Ministers of the Telugu States Should Hold Discussions with Small Producers – Chadalavada Srinivasa Rao

ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సారధ్యంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుగారితో ఆదివారం సోమాజి గూడా ప్రెస్‌ క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌ కార్య క్రమం నిర్వహించారు. చిత్ర పరిశ్రమలోని చిన్న సినిమాల స్థితిగతుల అంశం మీద మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధులుగా ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, ప్రముఖ దర్శకులు అజయ్‌కుమార్‌ ఎంతో మంది సీనియర్‌ జర్నలిస్టుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు రాసిన “శూన్యం నుండి శిఖరాగ్రం వరకు” పుస్తకం గద్దర్ అవార్డ్ సాధించిన సందర్భంగా వారికి శ్రీనివాసరావు గారి చేతుల మీదగా చిరు సత్కారాభినందన జరుగింది. ఆ తర్వాత సీనియర్ పత్రికేయులు ఉమామహేశ్వరరావు, మోహన్ గోటేటి, బాల్ రెడ్డి, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు పాటు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల జెవి ప్రసాదరావు, సెక్రటరీ సురేష్‌కొండేటిగారు కలిసి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుగారికి ఘన సత్కార కార్యక్రమం జరిగింది ఆ తర్వాత సన్మాన పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస్‌గారు మాట్లాడుతూ… ఈ రోజు ఆదివారం పత్రికా విలేఖరులు ఉదయం తొమ్మిది, పది గంటలకే రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు మన మిత్రుడు, మన పుత్రుడు మన స్నేహితుడు మన శ్రేయోభిలాషి మన ఆప్ద్‌బాంధవుడు ప్రభుగారికి గద్దర్‌ అవార్డు రావడం యావత్‌ సినీ పాత్రికేయులందరికీ కూడా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే రైట్‌ పర్సన్‌కి ఈ అవార్డు వచ్చింది. రైట్‌ పర్సన్‌ అని ఎందుకన్నానంటే… నేను మద్రాసు వెళ్ళిన కొత్తల్లో ఉమా (స్వర్గేయ) మిక్కిలినేని జగదీష్‌బాబు, బి.ఎ.రాజుగారు, బి.ఎ. జయ, పసుపులేటిరామారావుగారు, ట్రేడ్‌గైడ్‌ వెంకటేశ్వరావుగారు, రెడ్డిగారు వీరంతా ఉండేవారు. ఉమాగారు నన్ను పర్సనల్‌గా నన్ను తమ్ముడు అని పిలిచేవారు. ఆయన నాతో ఎన్నో మంచిమంచి పనులు చేయించుకున్నారు. అందుచేత ప్రభుకి నాకు ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఈ మధ్యకాలంలో ప్రభు, నేను ఇంకా ఇంకా దగ్గరయ్యాం. దానికి కారణం జర్నలిస్టులో ఎవరికి ఎటువంటి పని ఉన్నా కూడా తలలో నాలుకలా తయారయ్యి ప్రతిఒక్కరికి చేస్తాడు ప్రభు. దాసరినారాయణరావుగారు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో కొంతమందికి చేశారు. కానీ ప్రభు ఏ జర్నలిస్టుకి కష్టమొచ్చినా ఎంత అర్ధరాత్రి అయినా సరే ప్రభు ఉన్నాడు అనే స్టేజీకి భగవంతుడు ప్రభుని తీసుకెళ్ళాడు. ఇటువంటి ప్రభు మనందరి ఆయురారోగ్యాలు పోసుకుని నలుగురికి ఇంకా మంచి చేయాలని, గద్దర్‌ అవార్డు అందుకున్నందుకు అందరి తరపున మరొక్కసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. ఇక మీరేమైతే ప్రశ్నలు అడుగుతారో నిస్సదేహంగా అడగండి వాటన్నిటికీ కూడా నేను జవాబులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు.

ప్రశ్న – జవాబులు

చిన్న సినిమాకి ప్రభుత్వ పరంగా ఎలాంటి సపోర్ట్‌ ఉండాలంటారు?… డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్స్‌ ఇతర రాష్ట్రాలలో ఒక సినిమాకి మూడు నుంచి నాలుగు వేల వరకు వసూలు చేస్తే మన వద్ద వచ్చేసి 10వేల వరకు వసూలు చేస్తున్నారు క్యూబ్‌, యుఎఫ్‌ఓవారు? ఇది ఒక 100 థియేటర్స్‌లో ఒక చిన్న నిర్మాత సినిమాను విడుదల చేస్తే అక్కడే 10లక్షలు పోతున్నాయి దీని పై మీ అభిప్రాయం?

జ… చిన్న సినిమాలకు ముఖ్యంగా ప్రభుత్వ సపోర్ట్‌కన్నా కూడా మా ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్‌ అనేది చాలా అవసరం. అంతేకాక మా ఫిలిం ఛాంబర్‌ సపోర్ట్‌ కూడా చాలా అవసరం అన్నారు. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సపోర్ట్‌ చాలా అవసరం ఎందుకంటే…చిన్న సినిమా అనేది ఎదుగుదలకి ఒక మొక్కలాంటిది. ఎంత పెద్ద హిట్‌ అవ్వాలన్నాకూడా చెట్టుకి విత్తనం ఎంత అవసరమో చిన్న సినిమా కూడా ఇండస్ట్రీకి అంతే అవసరం. చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌, విజయ్‌దేవరకొండనుంచి ప్రతీ ఒక్కరూ కూడా చిన్న సినిమానుంచే పైకి వచ్చారు. ఆఖరికి రాజమౌళిగారు కూడా డైరెక్టర్లు కోదండరామిరెడ్డిగారు కూడా రాఘవేంద్రరావుగారు కూడా, దాసరినారాయణరావుగారు కూడా ‘స్వర్గం నరకం’ సినిమా అందుచేత చిన్న సినిమాలను బ్రతికిస్తే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. అందుచేత ప్రభుత్వం కంటే కూడా అవగాహనతో ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ కూడా మంచి సినిమాలు తీసే నిర్మాతల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించాలి. గతంలో 20,30ఏళ్ళ క్రితం చంద్రబాబుగారి హయాంలో చిన్న సినిమాలకు సబ్సిడీ ఇచ్చేవారు. ఒక సినిమాతో సక్సెస్‌ వస్తుందని ఎప్పుడూ నిర్మాత నమ్మకూడదు. అనుభవంతో ఉంటే ఏ నిర్మాత అయినా కూడా మంచి సినిమా తీయగలరు. రెండు గవర్నమెంట్లు కలిసి ఒక కమిటీ వేసుకుని చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.

ఇటీవల ఫిలిం ఛాంబర్‌ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏ సినిమా అయినా సరే థియేటర్‌ ఎనిమిది వారాల తరువాతే ఓటీటీకి ఇవ్వాలని తెలిసింది? ఈ ప్రభావం చిన్న సినిమాల పైన ఎంత వరకు పడుతుందని మీరు అనుకుంటున్నారు?

జ… చిన్న సినిమా అనేది తీయడం వరకు తీస్తున్నాం కానీ దాన్ని బ్రతికించడం కష్టం అయిపోయింది. ఓటీటీ కాదు థియేటర్లలో రిలీజ్‌ చేయడం చాలా కష్టమయిపోయింది. సినిమా ప్రాడక్ట్‌ వరకు మనం తయారు చేయగలం. కానీ అవి విడుదలవ్వాలంటే థియేటర్లు గతంలో లాగా ఉండడం లేదు. ఒకప్పుడు థియేటర్‌కు జనం ఎక్కువగా వచ్చేవారు. ఇప్పుడు చాలా సినిమాలు ఉండడం వల్ల ఆడియన్స్‌ తగ్గిపోయారు. చిన్న సినిమాకి పర్సంటేజి, రేట్లు అన్నీ చూసుకుంటే ముఖ్యంగా విపరీతమైన తినుబండారాల రేట్ల వలన థియేటర్‌కి ప్రేక్షకులు రాకపోవడం వల్ల ముఖ్యంగా చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఎంటైర్‌ విధానాన్ని మార్చాల్సిన అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా చిన్న నిర్మాతల పరిస్థితి ఇండస్ట్రీలో బాలేదు అది సత్యం.

గతంలో మీరు ఒక మాట అననారు నిర్మాతలకు అసలు వాల్యూ లేదు…డైరెక్టర్‌కానీ, హీరోలు కానీ ప్రొడ్యూసర్‌కి వాల్యూ ఇవ్వడం లేదు అన్నారు. ఎందుకని ప్రొడ్యూసర్‌ ఒక క్యాష్‌బ్యాంక్‌లాగా ఎందుకు అయిపోయారు?

జ…ఎందుకు అవుతారు నేను అయ్యానా. సరైన నిర్మాత ఎవరికైనా ఎందుకు లొంగుతారు. ఎప్పుడూ ఎదుటివారిది తప్పు ఉండదు. మనదే తప్పు ఉంటుంది. నేను కూడా పెద్ద సినిమాలు తీయగలను కానీ ఎందుకు తీయను. గతంలో నేను నాగేశ్వరావుగారితో, ఎన్టీఆర్‌తో, శోభనబాబుగారితో, కృష్ణతో, కృష్ణంరాజుతో పెద్ద సినిమాలే తీశాను కదా ఇప్పుడు ఎందుకు తీయడం లేదు. ఆ హీరోలు ఆ రోజుల్లో కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ ఆ సిన్సియారిటీ ఆ హానెస్టీ ఈరోజు లేదు కాబట్టి నేను చిన్న సినిమాలు నాకు తగ్గవి తీస్తున్నాను. నిర్మాత విలువ తగ్గించడం లేదు నేను అని అన్నారు.

చిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్ లు ఉన్నాయి, 24 శాఖలు ఉన్నాయి. కానీ ఏ శాఖకు ఉండాల్సిన అసోసియేషన్‌ ఆ శాఖకు ఉంది. డైరెక్టర్లకు, ఆర్టిస్టులకు, కెమెరమెన్లకు కానీ అలాగే నిర్మాతలకు ప్రొడ్యైసర్‌ కౌన్సిల్‌ ఉంది. ఏ అసోసియేషన్‌ కూడా దాంట్లో నుంచి పక్కకు వెళ్ళి వేరు కుంపటి పెట్టుకోలేదు. కానీ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌నుంచి కొంత మంది నిర్మాతలు గిల్డ్‌ అనేది పెట్టుకున్నారు. గిల్డ్‌ ప్రయోజనాలకి, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ యొక్క ప్రయోజనాలకి విభేదాలు ఏర్పడుతున్నాయి. ఇది చాలా అగాధాన్ని సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీలో సమస్యలు అనగానే పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలే తప్ప చిన్న సినిమాలను అడ్రస్‌ చేయడానికి లేకుండా పోయింది. అలా గిల్డ్‌ వేరుపడడానికి గల పరిస్థితుల గురించి వివరించండి?

జ…రెండు కుటుంబాలుంటే అందులో ఒకటి పేద కుటుంబం, ఒకటి రిచ్‌ కుటుంబం అనుకుందాం. అందులో పేద కుటుంబం అందరూ కలిసి కట్టుగా పని చేస్తున్నారు. పెద్ద కుటుంబంలో తండ్రి సంపాదించాక అందులో ఇద్దరు మేం బాగా సంపాదించాం అని బయటకు వెళ్ళిపోతే ఎలాగో మా సినిమా ఇండస్ట్రీ కూడా అలాగే తయారయింది. ఎవరైతే ఇండస్ట్రీ ద్వారా పెరుగుతున్నారో వాళ్ళు నలుగురు ఒకటయి కేవలం బిజినెస్‌తో అంటే భగవంతుడు గాలి, నీరు ఇచ్చారు కాబట్టి మనమందరం పీల్చుకుంటున్నాము. లేదంటే వీళ్ళ చేతుల్లో ఉంటే దాన్ని కూడా కొని మేము నలుగురమే బ్రతకాలి అంటారు ఈ గిల్డ్‌ అనేవారు. గిల్డ్‌ అనేది ఒక విషపురుగు, విషసస్కృతి. నేను గతంలో కూడా ప్రభుత్వానికి చెప్పాను. మళ్ళీ కూడా చెబుతున్నాను ఈ విష సంస్కృతిని పోషించే సినీ పెద్దలను ప్రభుత్వం ప్రోత్సహించవద్దు. అది సినిమా ఇండస్ట్రీకి దండనా మీకు ఓట్లు వేసి గెలిపించేది మా చిన్న నిర్మాతలు, కార్మికులే కానీ మీరు గెలిచిన అనంతరం పెద్ద నిర్మాతల వెనుక తిరగడం పెద్ద నిర్మాతలతో ఫొటోలు దిగడం ముఖ్యంగా గిల్డ్‌ వారితో కలిసి ఫొటోలు దిగడం అనేది ప్రభుత్వం చేసేది మంచి పద్ధతి కాదు.

చిన్న సినిమాకు మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి? ఎంత బడ్జెట్‌ వరకు ఉంటే అది చిన్న సినిమా అవుతుంది?

జ…పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా కరెక్టుగా తీస్తే 30రోజులు సరిపోతుంది. ఎం.ఎస్‌. విశ్వనాధ్‌గారుకానీ, విశ్వనాధ్‌గారు కానీ, చక్రవర్తిగారు కానీ మిగతా మ్యూజిక్‌ డైరెక్టర్లు అందరూ కూడా పాటను హాఫ్‌డేలో కంప్లీట్‌ చేశారు. ఒక సినిమాకి ఆరు పాటలుంటే మూడు రోజుల్లో కంప్లీట్‌ అయిపోయాయి. ప్రతి ఒక్కరం ఒక దగ్గరే ఉండి క్వాలిటీగా చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ అధునాతన సంగీతం వచ్చేసి అసలు డైరెక్టర్‌కి కూడా తెలియదు ఆ పాట ఏది వస్తుందో ఏమిటో ప్రొడ్యూసర్‌కి తెలియదు ఎవరికీ తెలియదు. పాత పద్ధతిలో ఉన్నప్పుడే క్వాలిటీ సాంగ్స్‌ వచ్చేవి. ఎక్కడికి వెళ్ళినా పాత సినిమాల పాటలే వినపడతాయి. కొత్త సినిమాల పాటలు వినపడవు. వీటి వలన క్వాలిటీ తగ్గిపోయింది. సరిగ్గా షూటింగ్‌ సమయాల్ని ప్లాన్‌ చేసుకుంటే బావుంటుంది కానీ లేదంటే కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ పెరిగిపోయి సినిమా ఇండస్ట్రీ మంచిది కాదనడం సరికాదు. క్వాలిటీ ప్రాడక్ట్‌ రావాలంటే డిసిప్లయిన్‌గా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. చిన్న సినిమాకి నాకు తెలిసి మూడు నుంచి ఐదు కోట్ల వరకు మంచి సినిమాను తీయవచ్చు. మీరు అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల టెన్‌ పర్సెంట్‌ స్క్రీన్‌మీద కనిపిస్తే మిగతా టెన్‌ పర్సెంట్‌ చెత్త బుట్టలో పడిపోతుంది. గతంలో అడవిరాముడు చిత్రం 26రోజుల్లో తీశారు. ఇటీవలె సంక్రాంతికి విడుదలైన చిత్రాలను తీసుకుంటే నాలుగు చిత్రాల్లో ఒకటి చాలా కాస్ట్‌లీ చిత్రం కానీ తక్కువ బడ్జెట్‌లో తీసిన సినిమానే హిట్‌ అయింది. ఈ సందర్భంగా ప్రభుగారి సతీమతి అయిన స్వర్గీయ మాధవిగారి పేరు మీద ఉన్న ట్రస్ట్‌ ద్వారా క్రిటిక్స్‌ అసోసియేషన్‌కి ప్రభుగారు చదలవాడశ్రీనివాసరావుగారి చేతుల మీదుగా యాభైవేల చెక్కును అందజేశారు.

చిన్న సినిమా ఈ రోజున ఈ పరిస్థితికి రావడానికి కారణం ఇండస్ట్రీనే అని కొంతమంది అనుకుంటున్నారు…మీ అభిప్రాయం?

జ… ఎవరు తీసినా ఉషాకిరణ్‌మూవీస్‌ వారు ఎలాంటి సినిమాలు తీశారు, ఎల్‌.వి. ప్రసాద్‌గారు ఎలాంటి సినిమాలు తీశారు, రామానాయుడుగారు ఎలాంటి సినిమాలు తీశారు. మంచి మంచి సంస్థలు మనుషులు ఉన్నా లేకున్నా వారసత్వాలు రన్‌ అవుతున్నారు కానీ వారసత్వపు ప్రొడ్యూసర్స్‌ రన్‌ అవ్వడం లేదు. కారణం ఏమిటంటే… అసలు సినిమా ఇండస్ట్రీలో ఖర్చు పెట్టిన డబ్బు వెనక్కి రాదు. గతంలో 90పర్సెంట్‌ వచ్చేది. ఇప్పుడు తగ్గిపోయింది. కారణం ఏమిటంటే డిసిప్లయిన్‌ లేకపోవడం.ప్రొడక్షన్‌ వాల్యూస్‌ మన చేతిలో లేకపోవడం.

గతంలో 2020,23లో ఎన్నో సినిమాలను రిలీజ్‌ కూడా చేశారు మీరు. చిన్న సినిమాలకు థయేటర్లే దొరకడం లేదన్నది పెద్ద సమస్యగా మారింది. అలాంటి పరిస్థితుల్లో నిర్మాత ఏం చేయాలి?

జ…నేను గతంలో మినీ థియేటర్లను కడదాం అని ప్లాన్‌ చేశాను. ఛాంబర్‌ ద్వారా మినీ థియేటర్స్‌ పాంప్లేట్‌ చేస్తే 100 తీసేకువెళ్ళారు. కానీ మాకు ప్రభుత్వం తరపునుంచి ఎటువంటి సహాయం లేదు. చిన్న థియేటర్ల లైసెన్స్‌ 50 నుంచి 200 వరకు ప్రతీ కమ్యూనిటీలో, ప్రతీ సందులో, ప్రతీ సంస్థలో చిన్న సినిమాల వల్ల వ్యరేటీ కథలు బయటకు వస్తాయి. బడ్జెట్‌లో తీస్తారు. కాబట్టి మినీ థియేటర్స్‌ వస్తే బావుంటుంది అని నా అభిప్రాయం.

ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్‌, గద్దర్‌ అవార్డ్‌ గ్రాహీత ప్రభుగారు మాట్లాడుతూ…నేడు ఈ కార్యక్రమం ఇంత బాగా కళ కళలాడడానికి ముఖ్యకారణం చదలవాడశ్రీనివాస్‌గారు. ఆయన చూపిన వితరణ ఆయన చూపిన సహృదిత వారి సౌజన్యం, వారి దాతృత్వం ఈ కారణాల వల్ల అందరూ కూడా విచ్చేశారు. ఇక కొంత మంది తమ పనుల ద్వారానో లేక కుదరకో తప్పించి వేరే ఆలోచన ఏమీ లేదని అన్నారు. ఫిల్మి క్రిటిక్స్‌ అసోసియేషన్లో నాకు గతంలో కూడా చాలా చాలా సన్మానాలు జరిగాయి. జీవితంలో మొదటిసారి 1993 ఆగస్టు11న రవీంద్రభారతిలో అప్పటి సీఎం కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్న తొలి సన్మానం మొదలుకొని ఎన్నో వందల అవార్డులు నేటి వరకు ఎన్నో సత్కారాలు జరిగాయి. నన్ను సత్కరించని సాంస్కృతిక సంస్థ లేదు బెస్ట్‌ జర్నలిస్ట్‌ అవార్డుతో. గతంలో నంది అవార్డు వచ్చింది. శంకర్‌డయాల్‌ శర్మ చేతుల మీదుగా రాజీవ్‌రత్న పురస్కారం అందుకున్నాను. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైన గద్దర్‌ అవార్డు కూడా అందుకోవడం నేను పడిన శ్రమకు తగిన ఫలితంగా రావడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను. అయితే ఎవరు ఎన్ని సత్కారాలు చేసిన నా కుటుంబ సభ్యులైన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌వారు నన్ను సత్కరించడం. నన్ను అభినందించడం సొంత ఇంటి వ్యక్తులు నావాళ్ళ సమక్షంలో జరిగిన ఈ సన్మానం నాకు చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇక నుంచి మన అసోసియేషన్‌లో ఏ కార్యక్రమం అయినా హౌస్‌ఫుల్‌గా జరుగుతుంది. దానికి కారణం చదలవాడశ్రీనివాస్‌గారు. గతంలో నేను జనరల్‌ సెక్రట్రీగా ఉన్నప్పుడు ఎన్నో ఎన్నో ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలను చేపట్టాము. అప్పట్లో రవీంద్రభారతిలో చేసినటువంటి సిల్వర్‌జూబ్లీ కార్యక్రమానికి మొత్తం ఫిలిం ఇండస్ట్రీ కదలి వచ్చింది. మేము కమిటీలో ఉన్నప్పుడే అక్రిడేషన్‌ కార్డుల కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తునటువంటి గద్దర్‌ అవార్డు కావొచ్చు. గతంలో ఇచ్చిన నంది అవార్డులు కావొచ్చు ది బెస్ట్‌ బుక్‌ ఆప్‌ ఫిలిం అవార్డును బెస్ట్‌ ఫిలిం జర్నలిస్ట్‌ అవార్డును ప్రభుత్వాన్ని అడిగి ఓకే చేయించుకున్నాది నేను, గుడిపూడిశ్రీహరిగారు. అప్పటి నుంచి ఆ అవార్డులునేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇందులో కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే… రెగ్యులర్‌ ఫిలిం జర్నలిస్టులు మాత్రమే ఈ అవార్డులకు అప్లై చేసుకోవాలి. కానీ… ఈ అవార్డులు రెగ్యులర్‌ జర్నలిస్టులకు కాకుండా ఎక్కడెక్కడో ఉన్న ఫీల్డ్‌తోగాని, సినిమాలతోగాని సంబంధం లేనివారు ఎక్కడో కూర్చుని ఫ్రీలాన్స్‌ జర్నలిస్టులుగా చేసేవారికి ఈ అవార్డులు దక్కడం. వారు రాసిన పుస్తకాలకు, వ్యాసాలకు బెస్ట్‌ జర్నలిస్ట్‌ అవార్డులను ఇస్తుంటే, ఇంతకాలం పాటు ఫీల్డ్‌లో తిరుగుతో సినిమారంగంలోని లోటుపాట్లను విశ్లేషిస్తూ ఆర్టికల్స్‌ రాస్తున్నటువంటి మనకు ఎందుకు రాకుండా మనల్ని కాదని ఎవరో అవార్డులు ఎగరేసుకుపోతున్నారనే బాధని కొంతమంది సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అది వాస్తవం కూడానూ. అవార్డు గ్రహీత అనేవారు ఎక్కడ పని చేస్తున్నారు. ఏ ఆర్గనైజేషన్‌ నుంచి వచ్చారు. లేదంటే ఫిలిం క్రిటిక్స్‌ మెంబరా అనే విషయాలను పరిగణలోకి తీసుకుని నెక్స్ట్‌ గద్దర్‌ అవార్డులు గాని భవిష్యత్తులో మరేదైనా అవార్డులు ఇచ్చినా ఆ ప్రవేశం ఉండాలన్న డిమాండ్‌ ఒకటి ఉంది. ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కేవలం ప్రొఫిషనల్‌ ఫిలిం జర్నలిస్ట్‌ మాత్రమే ఇలాంటి అవార్డులకు అర్హులు అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని అప్లై చేసుకునేలా మనం చాలా క్లారిటీగా ప్రాతినిత్యం వహించి ప్రభుత్వం వద్ద రిప్రజంట చేద్దాం అన్నారు. ప్రస్తుతం ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బత్తులప్రసాద్‌, సెక్రటరీ సురేషకొండేటి మిగతా కార్యవర్గం మొత్తం ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నారు. గత కొన్నేళ్ళుగా ఉన్న ఈ అసోసియేషన్‌ ద్వారా మన ఉనికిని మనం చాటుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలను మనం చేపట్టాలి. మాట్‌ ద ప్రెస్‌, కల్చరల్‌ ప్రొగ్రామ్స్‌ లాంటివి ఎన్నో మనం చేయాలి థ్యాంక్యూ అందరికీ అన్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ మోహన్‌ గోటేటిగారు మాట్లాడుతూ… ఎందరో మహా మహానుభావులు ఉన్న సంస్థ ఇది. దీన్ని మనందరం కూడా కలిసి ముందుకు తీసుకువెళ్ళాలి. కొత్త కమిటీ ఎన్నికయ్యాక వెంటనే చేపట్టిన కార్యక్రమం ఇది. దీనికి మన ఆత్మబంధువు అయిన చదలవాడశ్రీనివాస్‌గారిని ఆహ్వానించడం చాలా గొప్ప పరిణామం ఇది అని చెప్పాలి. ముందుగా మన కమిటీ వారిని ఈ విషయంలో ఎంతగానో అభినందిస్తున్నాను అన్నారు. శ్రీనివాస్‌రావుగారు ఎప్పుడూ కూడా మనల్ని మిత్రులు, పుత్రులు అంటారు మనల్ని. అంటే ఆయన మనల్ని ఎంతగా ఆయన సొంతమనుషులుగా భావిస్తున్నారో మీరు ఈ ఒక్క మాటను బట్టి తెలుసుకోవచ్చు. ఆయన కేలం చిన్న సినిమాలు మాత్రమే కాదు పెద్ద సినిమాలు కూడా చేస్తారు. ఇందులో ఎన్నో లోటుపాట్లు కూడా ఉన్నాయి. కానీ చిన్న సినిమాను నిలబెట్టాలి అనే ఒక లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం కూడా అదే. చిన్న సినిమాలు నిలబడితేనే ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తారు. పెద్ద సినిమాలు వస్తాయి వెళ్ళిపోతాయి. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ప్రెసిడెంట్‌ ప్రసాద్‌గారిని, సెక్రటరీ సురేష్‌గారిని వీరందరిని కోరుతూ చాలా థ్యాంక్స్‌ అని అన్నారు.

ప్రెసిడెంట్ జెవి బత్తులప్రసాద్‌గారు మాట్లాడుతూ… చిన్న నిర్మాతల పరిస్థితి మనగడకే ప్రమాదకరంగా మారింది. తిరిగి చిన్న సినిమా బ్రతికి బట్టకట్టాలంటే ఏం చేయాలి.. చిన్న నిర్మాతల పరిరక్షణ కమిటీ అని పెట్టి కొన్ని ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు మన చదలవాడ శ్రీనివాసరావుగారు. ఆయనకు 5వేల కోట్ల రూపాయలు పెట్టి ఒక సినిమా తీయగల సత్తా ఉంది. కానీ దానివల్ల కొంతమంది మాత్రమే పనిచేస్తారని చిత్ర పరిశ్రమలో ఉన్న కార్మికులందరికీ సదుపాయాలు సమకూరాలంటే చిన్నసినిమాలు బ్రతకాలి. కాబట్టి ఆయన ఒక న్యాయ పోరాటం చేస్తున్నారు. దాని గురించి జరిగే సమావేశం ఇది. నాకు ఈ అవకాశం కలిపించినందుకు థ్యాంక్యూ వెరీమచ్‌ అన్నారు.

సెక్రటరీ సురేష్‌కోండేటిగారు మాట్లాడుతూ… ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన ప్రతిఒక్కరికీ ఆయన తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో ఎఫ్‌సిఎ తరపున మరిన్ని కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించడానికి మా అసోసియేషన్‌ తరపు సన్నాహాలు చేస్తున్నాము. అలాగే త్వరలోనే మన అసోసియేషన్‌ డైమండ్ జూబ్లీ వేడుకలు కూడా నిర్వహించనున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు అని అన్నారు.

‘Her Strength.. ‘His Promise’ – Aryan Gaura’s third film ‘Pre Look’ released

‘జాంబి’ (G-Zombie), ‘ఓ సాతియా’ (O Saathiya) వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆర్యన్ గౌర. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన, ఇప్పుడు తన హ్యాట్రిక్ మూవీతో పలకరించడానికి రెడీ అవుతున్నారు. లక్ష్మీ నరసింహ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై జ్యోతి కుమారి, తారకేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫీల్ గుడ్ పోస్టర్.. ఆసక్తికర కథాంశం
తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. సూర్యాస్తమయం వేళ ఓ మహిళ వీల్ చైర్‌లో కూర్చుని ఉండగా, ఒక వైపు హీరో, మరో వైపు పెంపుడు కుక్కపిల్ల కూర్చున్న దృశ్యం ఎంతో హార్ట్ టచింగ్‌గా ఉంది. ‘ఆమె స్ట్రెంత్, అతడి ప్రామిస్.. వారి కథ’ అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమా ఒక బలమైన భావోద్వేగపూరితమైన ప్రయాణం అని సూచిస్తోంది. ముఖ్యంగా ఇది ఒక నిజ జీవిత కథ ఆధారంగా రూపొందుతుండటం గమనార్హం.

తారాగణం & సాంకేతిక నిపుణులు
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో వర్సటైల్ యాక్టర్ రావు రమేష్, వెటరన్ నటుడు శుభలేఖ సుధాకర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనుభవజ్ఞులైన నటీనటులతో పాటు, బలమైన కథ ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా వివరాలు:
హీరో: ఆర్యన్ గౌర
నిర్మాతలు: జ్యోతి కుమారి, తారకేశ్వర రావు
బ్యానర్: లక్ష్మీ నరసింహ మోషన్ పిక్చర్స్
ప్రధాన తారాగణం: రావు రమేష్, శుభలేఖ సుధాకర్ తదితరులు.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ఆర్యన్ గౌర గత చిత్రాల విజయ ప్రస్థానం
జి-జాంబి (2021): తెలుగులో తొలి జాంబి సినిమాగా వచ్చిన ఈ చిత్రంలో ఆర్యన్ గౌర హీరోగా, దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఓ సాతియా (2023): ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా వచ్చిన ఈ సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా మెప్పించింది. ఓటిటిలో 50 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి భారీ విజయాన్ని అందుకుంది.

Actress Raashii Khanna interview about Power Star Pawan Kalyan’s “Ustaad Bhagat Singh’ Movie

‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, శ్రీలీల కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఉగాది కానుగా మార్చి 19వ తేదీన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక రాశి ఖన్నా, ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విశేషాలను పంచుకున్నారు.

ప్రస్తుతం మీ జీవితం ఎలా ఉంది? ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు?
నా జీవితం ఇప్పుడు చాలా బిజీగా ఉంది. నిజం చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే కథ కూడా వినకుండా ఎంతో ఉత్సాహంతో వెంటనే ఓకే చెప్పేశాను. నేను నా మొదటి సినిమా చేస్తున్నప్పటి నుంచే, పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ గురించి, పవనిజం గురించి విన్నాను. అప్పుడే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలి అనుకున్నాను. ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో నా కల నెరవేరింది.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
నా పాత్ర పేరు శ్లోక. తను చాలా మోడరన్ అమ్మాయి. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంది. నా పాత్రకు కూడా మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నాకు ఇందులో ఒక మాస్ సాంగ్ ఉంది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను.

పవన్ కళ్యాణ్ గారితో పని చేసిన అనుభవం ఎలా ఉంది?
పవన్ గారు చాలా సింపుల్ పర్సన్, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. ఆయనలో ఒక తెలియని అమాయకత్వం ఉంది. మీరు నటి కావాలని ముందే అనుకున్నారా? అని మొదటిరోజే నన్ను అడిగారు. లేదు సార్, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నానని ఆయనతో చెప్పాను. ఆయన తక్కువ మాట్లాడతారు.. కానీ, ప్రతి మాటలో విలువ ఉంటుంది. నాతో ప్రజా సేవ చేయమని చెప్పారు. పవన్ గారు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఉస్తాద్ వేడుకలో స్టేజ్ మీద నుంచి పవన్ గారి అభిమానులను చూస్తుంటే, ఆయనను ఒక దేవుడిలా ఆరాధిస్తున్నట్లు అనిపించింది.

దర్శకుడు హరీష్ శంకర్ గారి గురించి ఏం చెప్తారు?
హరీష్ శంకర్ గారు చాలా స్మార్ట్. ఆయనకు మాస్ పల్స్ బాగా తెలుసు. సాధారణంగా 120 రోజులు పట్టే షూటింగ్‌ను ఆయన కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేశారు. సరిగా నిద్ర కూడా పోకుండా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. షూటింగ్ సమయంలో సెట్‌లోనే పంచ్‌ డైలాగ్స్ రాసి ఇస్తుంటారు. హరీష్ గారికి ఓపిక ఎక్కువ. సినిమా పట్ల ఆయన అంకితభావం చూసి చాలా నేర్చుకున్నాను.

ఇద్దరు హీరోయిన్లు (శ్రీలీల, మీరు) ఉండటం వల్ల స్క్రీన్ స్పేస్ తగ్గుతుందని అనిపించలేదా?
మా ఇద్దరికీ కలిసి సన్నివేశాలు లేవు. ప్రతి పాత్ర దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. నా పాత్రలో కూడా మంచి వేరియేషన్స్ ఉంటాయి.

పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కి తగ్గట్టుగా మీరు డేట్స్ ఇవ్వాలి కదా.. ఏమైనా ఇబ్బంది పడ్డారా?
పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్స్ ఎలా ఉంటాయో చెప్పలేమని హరీష్ గారు ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటాను అని చెప్పాను. కొన్నిసార్లు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటల షిఫ్టులు కూడా పని చేశాను.

మైత్రి మూవీ మేకర్స్ గురించి?
సినిమా కోసం ప్రాణం పెట్టే నిర్మాతలు వాళ్ళు. బడ్జెట్ విషయంలో రాజీ పడరు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. మైత్రి బ్యానర్ లో పని చేసే వాతావరణం చాలా బాగుంటుంది. ఆ బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఎలా ఉండబోతుంది?
‘గబ్బర్ సింగ్’ లాగే ఈ సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీ సినిమా, అందరూ కలిసి థియేటర్‌లో చూడొచ్చు. ఉగాది పండుగ సమయంలో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు.

మీ భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి చెప్పండి?
ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ గారితో ఒక సినిమా, ‘ఫర్జీ 2’ షో చేస్తున్నాను. అమెజాన్‌ సిరీస్ లో ఒక పంజాబీ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను, అందులో నా డైలాగ్స్ అన్నీ పంజాబీలోనే ఉంటాయి. తమిళ్ లో ‘రౌడీ అండ్ కో’ చేస్తున్నాను. తెలుగులో కూడా కొన్ని కథలు వింటున్నాను.